Breaking : హిమాచల్ ప్రదేశ్ లో ఘోరం- కుల్లూ జలవాతంలో పడిన స్కూలు బస్సు-16 మంది మృతి
హిమాచల్ ప్రదేశ్ ఇవాళ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గోర్జేలోని కులూ జలపాతంలోకి స్కూల్ బస్సు పడిన ఘటనలో దాదాపు 16 మంది విద్యార్ధులు చనిపోయారు. కులు జిల్లాలోని నియోలి-షంషేర్ రోడ్డులోని సైన్జ్ లోయలోని జంగ్లా ప్రాంతంలో ప్రైవేట్ బస్సు కొండపై నుంచి బోల్తా పడడంతో పలువురు విద్యార్థులతో సహా కనీసం 16 మంది మరణించారని పిటిఐ వార్తా సంస్ధ తెలిపింది.

కులూ జలపాతం ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించామని, కులు నుండి బృందాలు సంఘటనా స్థలానికి తరలించినట్లు కులు డిప్యూటీ కమిషనర్ అశుతోష్ గార్గ్ తెలిపారు. స్కూల్ బస్సు సైన్జ్ లోయలోని నియోలీ-షంషేర్ రహదారిపై కులు నుండి సైన్జ్కు వెళుతోంది. ఈ లోపే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మరణాల సంఖ్య ఇంకా పెరగవచ్చని భావిస్తున్నారు. ఘటనా స్ధలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సంఘటన ఇవాళ ఉదయం 8 గంటలకు చోటు చేసుకుంది. స్కూల్ పిల్లలు కూడా బస్సులో ప్రయాణిస్తున్నట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications