బ్రెగ్జిట్ ఎఫెక్ట్: భారత్ ఐటీ కంపెనీలపై దెబ్బ, ఎలా?
న్యూఢిల్లీ: బ్రెగ్జిట్ ప్రభావం భారత్, భారత్ ఐటీ కంపెనీల పైన కూడా పడనుంది. భారత్ నుంచి యూఈకి (యూరోపియన్ యూనియన్) 150 మిలియన్ డాలర్ల సాఫ్టువేర్ ఎగుమతులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరెన్సీ పైన ప్రభావం పడనుంది.
ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్కాం బ్రెగ్టి పైన స్పందిస్తూ.. లాభనష్టాలను అంచనా వేస్తున్నట్లు చెప్పారు. తక్షణ ప్రభావం తోసిపుచ్చలేమని చెబుతున్నారు. కరెన్సీ తదితర వాటి పైన వెంటనే ప్రభావం పడుతుందన్నారు.
ఈయూ నుంచి బ్రిటన్ బయటకు వెళ్లిపోతే.. భారత ఐటీ కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముందని తొలి నుంచి చెబుతున్నారు.

భారత్కు చెందిన టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తదితర దిగ్గజ ఐటీ కంపెనీలు బ్రిటన్ ప్రాంతంలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి.
బ్రెగ్జిట్ వల్ల 2016-17లో బ్రిటన్లోని ఈ కంపెనీల కార్యకలాపాల ఆదాయ వృద్ధి 10-14 శాతం తగ్గొచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్లించ్ తొలుతే అంచనా వేసింది.
బ్రిటన్, ఐరోపా ప్రాంతాల వృద్ధిలో మందగమనం, పౌండు క్షీణించే అవకాశం ఉండటం ఇందుకు కారణాలుగా పేర్కొంటోంది. అలాగే ఒక్కో షేరుపై ఆర్జించే ఆదాయం (ఎర్నింగ్ ఫర్ షేర్- ఈపీఎస్) పైనా 3-8 శాతం వరకు ప్రభావం పడుతుందని అభిప్రాయపడుతోంది.
బ్రెగ్జిట్ ఐటీ రంగాన్ని తీవ్ర నష్టాల్లోకి నెట్టింది. డాలర్కు వ్యతిరేకంగా బ్రిటన్ పౌండ్ విలువ భారీగా పతనం కావడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజిలో ఐటీ ఇండెక్స్ 4 శాతానికి పైగా నష్టపోయింది. ఈ ప్రభావం స్వల్పమేనని ఐటీ నిపుణులు అంటున్నారు.
టెక్ మహీంద్రా దాదాపు ఏడు శాతం, హెచ్సీఎల్ టెక్ ఎక్కవ 6 శాతం క్షీణించగా, టీసీఎస్, విప్రో 3 నుంచి ఆరు శాతం మేర పతనమయ్యాయి. అలాగే యూకే నుంచి టీసీఎస్ 13 సాతం హెచ్సీఎల్ టెక్ 14 శాతం భారీ ఆదాయాన్ని పొందుతుండగా, ఇన్ఫోసిస్, విప్రోలు కూడా దాదాపు 7 నుంచి 11 శాతం ఆదాయాన్ని పౌండ్లలో పొందుతున్నాయని చెబుతున్నారు. పౌండ్ విలవ 31 సంవత్సరాల కనిష్టానికి కూలిపోయింది.
బ్రిటన్ యూరోపియన్ వైదొలుగుతున్న ప్రభావం ఐటీ పరిశ్రమ పైన స్వల్ప కాలికమేనని పరిశ్రమ పెద్దలు అభిప్రాయపడ్డారు. ఈ అనిశ్చిత వాతావరణంలో భారీ హెచ్చుతగ్గులు, ప్రతికూల ప్రభావం ఉంటుందన్నారు. బ్రెగ్జిట్ ప్రభావంతో మారకపు అనిశ్చితి కారణంగా ప్రతికూల ప్రభావం స్వల్పకాలమే ఉంటుందని నాస్కాం అధ్యక్షులు ఆర్ చంద్రశేఖర్ తెలిపారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications