ట్రంప్, మోడీ కంటే బ్రిటన్ ప్రధాని చీరకట్టుకు జై
బెంగళూరు: అమెరికా ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ ప్రభంజనం, మరో వైపు భారత్ లో నల్లధనంపై రూ. 500, రూ.1,000 నోట్లు రద్దు చేసి బ్లాక్ మనీపై యుద్దం చేస్తున్న సమయంలో అందరూ ఎవరికి తోచినట్లు వారు సోషల్ మీడియాలో జోకులు పేల్చుతున్నారు.
మరి కోందరు మాకు పెద్ద నోట్ల కష్టాలు ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. అయితే వీరిద్దరి దృష్టిని పక్కకు నెట్టిసి ఈ రెండు అంశాల కంటే భారతీయులను ఎక్కువ సంతోష పరిచిన మరో అంశం ఇంకోటి ఉంది. అదేమిటంటే బ్రిటన్ ప్రధాన మంత్రి థెరిసా మే భారతీయ సంప్రాధాయ పద్దతిలో చీర కట్టి అందరినీ ఆకర్షించారు.
బ్రిటన్ ప్రధానిగా పదవి బాధ్యతలు చేపట్టిన తరువాత యూరప్ యేతర తొలి విదేశీ పర్యటనలో భాగంగా థెరిసా మే భారత్ వచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోడీతో పలు కీలక చర్చల్లో పాల్గొన్నారు.
తరువాత బెంగళూరు చేరుకున్న బ్రిటన్ ప్రధాని థెరిసా మేకు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (బెంగళూరు) దగ్గర భారత సంప్రాధాయం ప్రకారం మహిళలు స్వాగతం పలికారు. ఆ స్వాగత ఏర్పాట్లు చూసిన థెరిసా మే ఆశ్చర్యానికి గురైనారు.
తరువాత బెంగళూరు నగరంలోని హలసూరు ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధి చెందిన పురాతన శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం దర్శించాలని ఆమె నిర్ణయించారు. అచ్చం భారతీయురాలిగా పట్టు చీర కట్టుకుని ఆలయంలోకి అడుగు పెట్టారు.
ఆలయం మొత్తం తిరిగి శ్రీ సోమేశ్వర స్వామి ఆలయ చరిత్ర గురించి అక్కడి అర్చకులు, దేవాలయ కమిటి సభ్యులను అడిగి తెలుసుకున్నారు. హిందూ సాంప్రధాయ పద్దతిలో శివుడికి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ ఫోటోలు చూసిన పలువురు భారతీయులు బ్రిటన్ ప్రధాని గ్రేట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఓ దేశానికి ప్రధాని అయిన ఆమె తన హోదాను పక్కన పెట్టి హిందూ సాంప్రధాయాన్ని గౌరవించడం నిజంగా గొప్ప విషయం అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
అమెరికాలో ట్రంప్ గెలుపు కంటే, భారత్ లో రూ. 500, రూ. 1,000 నోట్ల రద్దు కంటే మాకు ఎక్కువ సంతోష పరిచే విషయం ఏమిటంటే బ్రిటన్ ప్రధాని థెరిసా మే చీరకట్టడమే అంటూ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.