Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ పార్టీతో పొత్తు విషయంలో మోదీ, అమిత్ షా డిసైడ్ చేస్తారు, మాజీ సీఎం పక్కా క్లారిటీ వచ్చింది !

బెంగళూరు: కర్ణాటకలో బీజేపీ-జేడీఎస్ పొత్తుపై చర్చ కొనసాగుతోంది. మరోవైపు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు మాజీ సీఎం బీఎస్‌ యడ్యూరప్ప బుధవారం ఢిల్లీ వెళ్లారు. అంతకుముందు బీఎస్ యడియూరప్ప మీడియాతో మాట్లాడుతూ బీజేపీ-జేడీఎస్ పొత్తుపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

బెంగళూరులోని డాలర్స్ కాలనీలోని తన నివాసం వెలుపల విలేకరులతో మాట్లాడిన బీఎస్. యడ్యూరప్ప లోక్‌సభ ఎన్నికలపై సీఈసీ సమావేశంలో చర్చించే అవకాశం ఉందన్నారు. ఈరోజు ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది, నేను రేపు తిరిగి బెంగళూరు రావాలనుకుంటున్నాను. లోక్‌సభ ఎన్నికల సన్నాహకాలపై చర్చ జరుగుతుందని ఆశిస్తున్నాను అని బీఎస్ యడియూరప్ప అన్నారు..

BS Yeddyurappa clarified that Prime Minister Modi and Amit Shah will decide on alliance in Lok Sabha elections.
లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో, జేడీఎస్ తో బీజేపీ పొత్తు విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని బీఎస్ యడియూరప్ప అన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాల నిర్నయానికి కర్ణాటక బీజేపీ నాయకులు కట్టుబడి ఉన్నారని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు యడ్యూరప్ప ఢిల్లీకి వెళ్లే ముందు బెంగళూరులో చెప్పారు.

దీనిపై జేడీఎస్ నేత, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి మాట్లాడుతూ పొత్తు విషయంలో బీజేపీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అంగీకరిస్తామని అన్నారు. వినాయక చవితి పండుగ తర్వాతే ఈ అంశంపై చర్చ జరుగుతుందని మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి చెప్పారు. పొత్తుకు ఇంకా సమయం ఉందని, మేము తొందరపడటం లేదని, జేడీఎస్ పార్టీలో సమగ్ర చర్చ జరగాలని, వినాయక చవితి పండుగ తర్వాత ఈ విషయంప మాట్లాడుదామని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు.

BS Yeddyurappa clarified that Prime Minister Modi and Amit Shah will decide on alliance in Lok Sabha elections.
కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప బెంగళూరులోని జేపీ నగర్‌లోని మాజీ సీఎం కుమారస్వామిని ఆయన నివాసంలో కలిశారు. పొత్తు చర్చలు ప్రారంభమైన తర్వాత రాష్ట్ర స్థాయి నేతలు కుమారస్వామిని కలవడం ఇదే తొలిసారి. దీనికి ముందు మాజీ మంత్రి ఆర్.అశోక్ ను కుమారస్వామి చర్చకు పిలిచారు. లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్ ఆరు లోక్ సభ నియోజక వర్గాల్లో పోటీ చేయబోతున్నట్లు సమాచారం.

అయితే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా నాలుగు సీట్లకు జేడీఎస్ కు ఇచ్చేందుకు అంగీకరించారని బీఎస్ యడ్యూరప్ప గతంలోనే మీడియాకు చెప్పారు. ఈ నెలాఖరులోగా సీట్ల కేటాయింపుపై చర్చ జరిగే
అవకాశం ఉందని బీజేపీ, జేడీఎస్ పార్టీకి చెందిన నాయకులు చెబుతున్నారు. మొత్తం మీద 2024లో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ-జేడీఎస్ కలిసి పోటీ చేస్తాయని తెలిసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+