వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

15రోజుల్లో 104ను 111 చేస్తారా?: యడ్యూరప్పకు చిదంబరం చురక

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కర్ణాటక గవర్నర్ విజుభాయి వాలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేపీని ఆహ్వానించడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం లేకున్నా బీజేపీని ఆహ్వానించడమంటే ఇతర పార్టీల ఎమ్మెల్యేల ఫిరాయింపులకు మద్దతిచ్చినట్లేనని ఆరోపిస్తోంది.

ఎవరీ యడ్యూరప్ప?: గుమస్తాగా ప్రస్థానం మొదలుపెట్టి, 23వ సీఎంగా ప్రమాణంఎవరీ యడ్యూరప్ప?: గుమస్తాగా ప్రస్థానం మొదలుపెట్టి, 23వ సీఎంగా ప్రమాణం

కాంగ్రెస్-జేడీఎస్ కలిసి స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటే అవకాశం ఇవ్వకుండా, బీజేపీకి తొలి ప్రాధాన్యత ఇవ్వడమేంటని మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత, న్యాయవాది కూడా అయిన చిదంబరం ప్రశ్నించారు.

BS Yeddyurappa Gets 15 Days To Convert 104 To 111 Seats: P Chidambarams Swipe

'15రోజుల్లో యడ్యూరప్పను మెజార్టీ సాధించాలంటూ గవర్నర్ అవకాశం ఇచ్చినట్లుంది. గవర్నర్ ఆహ్వానంతో.. 15రోజుల్లో బీజేపీకి దక్కిన 104స్థానాలను 111గా యడ్యూరప్ప మార్చేస్తారు?' అంటూ చిదంబరం ఎద్దేవా చేశారు. గవర్నర్ ఆహ్వాన లేఖ కాపీని కూడా ఆయన ట్వీట్ చేశారు.

ఇంత చేసినా ఓడించారు: సిద్ధరామయ్య కన్నీటిపర్యంతం, సీనియర్ నేతల విమర్శలు ఇంత చేసినా ఓడించారు: సిద్ధరామయ్య కన్నీటిపర్యంతం, సీనియర్ నేతల విమర్శలు

స్పష్టమైన మెజార్టీ కలిగి ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ పిలవకపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు. తమకు మెజార్టీ ఉన్నా ప్రభుత్వ ఏర్పాటుకు పిలవకపోవడం అక్రమమని మరో కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ అన్నారు.

English summary
Karnataka Governor Vajubhai Vala's invite to the BJP's BS Yeddyurappa has provoked a sharp attack from the Congress that has accused the governor of encouraging horse-trading by inviting the BJP to form the government when it did not have the numbers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X