కేంద్ర బడ్జెట్ 2025 LIVE: బీహార్‌‌కు పెద్ద పీట-నిర్మలమ్మ మార్క్ బడ్జెట్..!!

కేంద్ర బడ్జెట్ Live updates 2025-26: ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రం శనివారం (2025 ఫిబ్రవరి 1)న ఉదయం 11 గంటలకు పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మూడవ సారి మోదీ ప్రభుత్వంలో రెండవ సారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దీంతో ఆర్థికశాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ వరుసగా 8వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్లయ్యింది.అంతకుముందు మొరార్జీ దేశాయ్ వరుసగా ఆరు సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

అయితే ఈ సారి బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు నిర్మలమ్మ.అదే సమయంలో కొన్ని పన్ను సంస్కరణలు కూడా చేపట్టారు. పాత పన్ను విధానం రద్దు చేసి ఏడాదికి రూ.12 లక్షలలోపు ఆదాయం ఉన్న వారికి జీరో ఇన్‌కంటాక్స్ విధానం ప్రవేశపెట్టారు.అయితే దీనిపై ఎలాంటి రియల్ ఎస్టేట్ సెక్టార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు కేటాయింపులపై కూడా ఆసక్తికర ప్రకటన చేశారు. మొత్తానికి నిర్మలమ్మ బడ్జెట్‌లో ఈ ఏడాది ఎన్నికలకు వెళుతున్న బీహార్ రాష్ట్రంపై కనికరం చూపారనే అభిప్రాయం వినిపిస్తోంది. బడ్జెట్‌కు సంబంధించి మినిట్-టూ మినిట్ లైవ్ అప్‌డేట్స్‌ను ఫాలో అవ్వండి.

Budget 2025 Live Updates FM Nirmala Sitharaman Speech Key Announcements sector wise breakdown in telugu

Feb 04, 2025, 5:14 pm IST

నిజాయితీతో పన్ను కట్టే టాక్స్ పేయర్లను మోదీ ప్రభుత్వం గుర్తిస్తుంది: నిర్మలా సీతారామన్
Feb 01, 2025, 4:50 pm IST

ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంతో ప్రత్యేకమైంది. వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా వేసిన మొదటి అడుగు ఇది. పేదరిక నిర్మూలన, మౌలిక వసతుల కల్పనకు కేంద్రం ప్రాధాన్యం ఇచ్చింది. పేదలు, మధ్య తరగతి ప్రజలు, ఉద్యోగులకు ఎంతో మేలు చేసే బడ్జెట్ ఇది.ఆదాయ పన్ను విషయంలో మోడీ సర్కార్ గొప్ప నిర్ణయం తీసుకుంది. ఆదాయం కోల్పోతునప్పటికీ ప్రజాశ్రేయస్సు కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. -కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
Feb 01, 2025, 4:34 pm IST

ఖర్చు చేసే ప్రతి రూపాయి విషయంలో అత్యంత వివేకంతో వ్యవహరించాం. వ్యవసాయ రంగంలో విత్తనం నుంచి మార్కెట్ వరకు అన్ని రకాల మార్పులకు శ్రీకారం చుడుతున్నాం. రూ.12 లక్షల ఆదాయం ఉన్నవారు ఇప్పటివరకు రూ.80 వేలు పన్ను కట్టేవారు, ఇకపై ఏమీ కట్టనక్కర్లేదు. -నిర్మలా సీతారామన్.
Feb 01, 2025, 2:03 pm IST

జైరాం రమేష్ విమర్శ

ఈ బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్టా లేక బీహార్ ప్రభుత్వం బడ్జెట్టా..ఆంధ్రప్రదేశ్‌ను ఎందుకు విస్మరించారు..? ఏపీలో కూడా ఉన్నది ఎన్డీయే సర్కారే కదా..? : కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్
Feb 01, 2025, 12:24 pm IST

ఆదాయపు పన్ను కొత్త స్లాబ్‌లు

రూ 4 నుండి 8 లక్షలు – 5శాతం, రూ 8 నుండి 12 లక్షలు – 10శాతం రూ 12 – 16 లక్షలు – 15శాతం,రూ 16 – 20 లక్షలు – 20శాతం,రూ 20 – 24 లక్ష – 25శాతం రూ 24 లక్షలు ప్లస్ – 30శాతం
Feb 01, 2025, 12:13 pm IST

ఆదాయం పన్ను పై బిగ్ రిలీఫ్

Incoe tax slabs
రూ.12 లక్షల ఆదాయం ఉన్నవారికి నో టాక్స్
Feb 01, 2025, 12:11 pm IST

సీనియర్ సిటిజన్‌ల కోసం TDS పరిమితిని రూ. 50,000 నుండి రూ. 1 లక్షకు పెంచినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.
Feb 01, 2025, 12:09 pm IST

ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలు పరిమితిని 2 సంవత్సరాల నుండి 4 సంవత్సరాలకు పెంపు
Feb 01, 2025, 12:08 pm IST

మెడికల్ సీట్లు పెంపు

మెడికల్ కాలేజీల్లో దేశవ్యాప్తంగా అదనంగా 10వేల సీట్లు వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తాయని నిర్మలమ్మ ప్రకటించారు. రానున్న ఐదేళ్ల సీట్ల సంఖ్యను 75వేలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
Feb 01, 2025, 12:06 pm IST

ఔషధాలపై నిర్మలమ్మ ప్రకటన

క్యాన్సర్ రోగులకు ఉపశమనం కలిగించడానికి, ప్రభుత్వం ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుండి పూర్తిగా మినహాయించబడిన మందుల జాబితాలో 36 ప్రాణాలను రక్షించే మందులను చేర్చుతుంది.
Feb 01, 2025, 12:05 pm IST

సెస్ సర్‌చార్జ్ సవరణలు

ఒకటి కంటే ఎక్కువ సెస్ లేదా సర్‌చార్జ్ విధించకూడదని ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
Feb 01, 2025, 12:03 pm IST

టారిఫ్ రేట్ సర్దుబాట్లు

2023-24 బడ్జెట్‌లో తొలగించిన ఏడు రేట్లకు అదనంగా ఏడు టారిఫ్ రేట్లను తొలగిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దీంతో సున్నా రేటుతో సహా ఎనిమిది టారిఫ్ రేట్లు మాత్రమే మిగిలి ఉంటాయని ఆమె చెప్పారు.
Feb 01, 2025, 11:58 am IST

రుణాలు కాకుండా మొత్తం రసీదుల సవరించిన అంచనా రూ. 31.47 లక్షల కోట్లు, అందులో నికర పన్ను చెల్లింపులు రూ. 25.57 లక్షల కోట్లుగా ఉన్నాయని నిర్మలమ్మ ప్రకటించారు
Feb 01, 2025, 11:56 am IST

ఆర్థిక సంవత్సరం 2025కు ద్రవ్య లోటు 4.8శాతం ఉండగా,ఆర్థిక సంవత్సరం 2026కు అంచనా 4.4శాతం
Feb 01, 2025, 11:50 am IST

బీమా FDI 74% నుండి 100శాతంకు పెంపు

బీమా ఎఫ్‌డిఐని 74% నుండి 100% పెంచుతామని నిర్మలా సీతారామన్ చెప్పారు.
Feb 01, 2025, 11:50 am IST

కొత్త ఆదాయపు పన్ను బిల్లు

కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెడతామని ఆర్థిక మంత్రి తెలిపారు.
Feb 01, 2025, 11:45 am IST

న్యూక్లియర్ ఎనర్జీ మిషన్‌

పరిశోధన మరియు అభివృద్ధి కోసం అణుశక్తి మిషన్‌లో భాగంగా, కనీసం ఐదు స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన చిన్న మాడ్యులర్ (అణు) రియాక్టర్‌లు 2033 నాటికి అందుబాటులోకి వస్తాయని నిర్మలాసీతారామన్ తెలిపారు.
Feb 01, 2025, 11:42 am IST

నూతన ఉడాన్ పథకం

120 కొత్త గమ్యస్థానాలను చేర్చి, 4 కోట్ల మంది అదనపు ప్రయాణీకులకు సేవలందించే సవరించిన ఉడాన్ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు
Feb 01, 2025, 11:41 am IST

డే కేర్ క్యాన్సర్ సెంటర్

క్యాన్సర్ కేర్ యాక్సెస్‌బిలిటీని పెంచే లక్ష్యంతో వచ్చే మూడేళ్లలో అన్ని జిల్లా ఆసుపత్రుల్లో డేకేర్ క్యాన్సర్ సెంటర్‌లను ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే 200 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు
Feb 01, 2025, 11:41 am IST

జలజీవన్ మిషన్ పొడిగింపు

జల్ జీవన్ మిషన్‌ను 2028 వరకు పొడిగించనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. 2019 నుండి, గ్రామీణ జనాభాలో 80 శాతం వరకు నీటి సరఫరా అందుతోందన్నారు.దీన్ని 100శాతానికి తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతుందన్నారు
Feb 01, 2025, 11:39 am IST

విద్యారంగానికి వరాలు

AI విద్యకోసం రూ.500 కోట్లు కేటాయింపులు,నైపుణ్యం కోసం 5నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు,2014 తర్వాత ప్రారంభించిన 5 ఐఐటీల్లో మరో 6500 మంది విద్యార్థుల కోసం అదనపు మౌలిక సదుపాయాలు సృష్టించడం,మాతృభాష కోసం భారతీయ భాషా పుస్తక్ పథకం ప్రారంభించబడుతుంది
Feb 01, 2025, 11:35 am IST

బీహార్‌కు మరో వరం

బీహార్‌కు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టును ప్రకటించిన నిర్మలా సీతారామన్. పట్నా విమానాశ్రయం విస్తరణ జరుగుతుంది
Feb 01, 2025, 11:35 am IST

అటల్ టింకరింగ్ ల్యాబ్స్

రానున్న ఐదేళ్లలో 50వేల పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇంటర్నెట్ కనెక్టివిటీని ప్రభుత్వ పాఠశాలలకు అందజేస్తామని తెలిపారు
Feb 01, 2025, 11:33 am IST

దేశ పురోగతిలో పెట్టుబడులు కీలకం అని అభివర్ణించారు నిర్మలా సీతారామన్. దేశాభివృద్ధిలో మూడవ ఇంజిన్‌గా పెట్టుబడులు వ్యవహరిస్తాయని పేర్కొన్నారు
Feb 01, 2025, 11:32 am IST

బీహార్ ఫోకస్‌గా నిర్మలమ్మ బడ్జెట్

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బీహార్ కోసం అనేక ప్రకటనలు చేశారు. బీహార్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మరియు మేనేజ్‌మెంట్ ఏర్పాటు చేయబడుతుందన్నారు.ఇది తూర్పు ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ కార్యకలాపాలను పెంచే లక్ష్యంతో ఉంటుందని చెప్పారు. ఈ చొరవ రెండు కీలక ఫలితాలను కలిగి ఉంటుందని చెప్పిన నిర్మలమ్మ మొదటిగా రైతులను మెరుగుపరుస్తుందని రెండవది వారి ఉత్పత్తులకు విలువను జోడించడం ద్వారా ఆదాయం చేకూరుస్తుందని చెప్పారు. ఈ ప్రాంతంలోని యువతకు నైపుణ్యం, వ్యవస్థాపకత మరియు ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని చెప్పుకొచ్చారు నిర్మలమ్మ
Feb 01, 2025, 11:26 am IST

తుర్ మరియు మసూర్‌లపై ప్రత్యేక దృష్టి సారించి, పప్పుధాన్యాలలో స్వావలంబన సాధించే లక్ష్యంతో ప్రభుత్వం 6 సంవత్సరాల మిషన్‌ను ప్రారంభిస్తుందని ఆర్థిక మంత్రి ప్రకటించారు. నాఫెడ్ మరియు ఎన్‌సిసిఎఫ్ వంటి కేంద్ర ఏజెన్సీలు ఈ పప్పుధాన్యాలను ఏజెన్సీలలో నమోదు చేసుకొని ఒప్పందాలు కుదుర్చుకునే రైతుల నుండి కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయని నిర్మలా సీతారామన్ చెప్పారు.
Feb 01, 2025, 11:25 am IST

7.7 కోట్ల మంది రైతులు, మత్స్యకారులు,పాడి రైతులకు స్వల్పకాలిక రుణాలను అందించడానికి కిసాన్ క్రెడిట్ కార్డ్‌లు (కెసిసి) కొనసాగుతాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. KCC ద్వారా తీసుకునే రుణాలకు రుణ పరిమితి ₹ 3,000 నుండి ₹ 5,000 వరకు పెంచబడుతుందని ఆమె తెలిపారు.
Feb 01, 2025, 11:22 am IST

బొమ్మల తయారీ

బొమ్మల తయారీ రంగంను బలోపేతం చేస్తూ ప్రపంచంలోనే టాయ్స్ హబ్‌గా భారత్‌ను నిలిపే ప్రయత్నం చేస్తున్నాం: సీతారామన్
Feb 01, 2025, 11:21 am IST

లెదర్ & ఫుట్ వేర్

లెదర్ అండ్ ఫుట్‌వేర్ రంగంలో 22 లక్షల ఉద్యోగాలు కల్పిస్తూ ఈ రంగాన్ని బలోపేతం చేస్తాం: నిర్మలా సీతారామన్
Feb 01, 2025, 11:20 am IST

5 లక్షల MSME మహిళలకు ప్రత్యేక పథకాలను అమలు చేస్తాం: నిర్మలా సీతారామన్
READ MORE

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+