నీతి ఆయోగ్ సీఈవోగా బీవీఆర్ సుబ్రమణ్యం, ప్రపంచ బ్యాంక్ ఈడీగా పరమేశ్వరన్
నీతి ఆయోగ్ సీఈవోగా మాజీ ఐఏఎస్ అధికారి, మాజీ కామర్స్ సెక్రటరీ బీవీఆర్ సుబ్రమణ్యం నియమితులయ్యారు.
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ సీఈవోగా మాజీ ఐఏఎస్ అధికారి, మాజీ కామర్స్ సెక్రటరీ బీవీఆర్ సుబ్రమణ్యం నియమితులయ్యారు. ప్రస్తుతం సీఈఓగా ఉన్న పరమేశ్వరన్ అయ్యర్.. ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులైన నేపథ్యంలో కొత్త సీఈవోను నియమించారు.
రెండేళ్ల కాలానికి గానూ సుబ్రమణ్యం నీతి ఆయోగ్ సీఈవో పదవిలో కొనసాగనున్నారు. లేదంటే తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన ఆ పదవిలో ఉంటారు. ఈ మేరకు కేబినెట్ అపాయింట్స్మెంట్ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. 1988 బ్యాచ్ జమ్మూకాశ్మీర్ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన సుబ్రమణ్యం ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు.

నీతి ఆయోగ్ సీఈవోగా ఉన్న అయ్యర్ను మూడేళ్ల కాలానికి అమెరికాలోని వాషింగ్టన్ డీసీలోని ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించినట్లు ప్రకటించారు.
బీవీఆర్ సుబ్రహ్మణ్యం ఎవరు?
గతంలో జమ్మూ కాశ్మీర్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సుబ్రహ్మణ్యం, రాష్ట్రానికి ప్రత్యేక హోదాను రద్దు చేసి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించాలనే కేంద్రం యోచన గురించి సమాచారం అందించిన కొద్దిమంది బ్యూరోక్రాట్లలో ఒకరిగా ఉన్నారు.
1987 బ్యాచ్కు చెందిన ఛత్తీస్గఢ్ కేడర్ ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యం అంతర్గత భద్రతపై నిపుణుడు. రాష్ట్రంలోని పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని రద్దు చేసిన తర్వాత జూన్ 2018లో రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించిన తర్వాత జమ్మూకాశ్మీర్కి డిప్యూటి చేయబడే ముందు ఛత్తీస్గఢ్లో అదనపు ప్రధాన కార్యదర్శి (హోమ్)గా ఉన్నారు.
2004 నుంచి 2008 వరకు, 56 ఏళ్ల ఈ అధికారి మన్మోహన్ సింగ్ ప్రైవేట్ సెక్రటరీగా పనిచేశారు. ప్రపంచ బ్యాంక్లో పనిచేసిన తర్వాత, ఆయన 2012లో ప్రధానమంత్రి కార్యాలయానికి తిరిగి వచ్చారు.












Click it and Unblock the Notifications