Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Bengal post-poll violence case -సీబీఐ, సిట్ దర్యాప్తునకు కలకత్తా హైకోర్టు ఆదేశం -సుప్రీంకు వెళ్లనున్న మమత!

పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి మూడు నెలలు పూర్తయినా రాజకీయ వివాదాలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. శక్తిమంతమైన ద్వయం మోదీ-షా నేతృత్వంలోని బీజేపీని ఢీకొడుతూ మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ మూడోసారి విజయం సాధించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా భారీ హింస చెలరేగింది. నాటి ఘటనలపై కోర్టుల విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది..

Recommended Video

    Pegasus: Mamata Banerjee VS PM Modi - 'Khela Hobe' | 2024 General Elections | Oneindia Telugu

    బెంగాల్ లో ఎన్నికల తర్వాత చోటుచేసుకున్న హింసకు సంబంధించిన కేసులపై కలకత్తా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. హింసాత్మక ఘటనలపై పిటిషనర్లు, మమత సర్కారు భిన్నవాదనలు వినిపిస్తున్న క్రమంలో, సదరు ఘటనలపై కేంద్ర సంస్థ సీబీఐతో దర్యాప్తు చేయించాలని హైకోర్టు నిర్ణచించింది. బెంగాల్ పోస్ట్ పోల్స్ వాయలెన్స్ కేసుల విచార‌ణ‌ను సీబీఐకి అప్పగిస్తూ కలకత్తా హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు,

     Calcutta HC orders CBI probe into Bengal post-poll violence, Mamata Govt Likely to Move SC

    ఎన్నికల అనంతర హింసపై సీబీఐ దర్యాప్తుతోపాటు కోర్టు ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) కూడా సమాంతర విచారణ జరుపుతుందని హైకోర్టు తెలిపింది. ఎన్నికల అనంతర హింసపై దాఖలైన పిటిషన్లను కలకత్తా హైకోర్టు తాత్కాలిక చీఫ్ జ‌స్టిస్ రాజేష్ బిందాల్ నేతృత్వంలోని ఐదుగురు స‌భ్యుల ధ‌ర్మాస‌నం విచారణ జరిపింది.

    ఏడాది మే 2న తృణ‌మూల్ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో తీవ్ర హింస చెల‌రేగింది. దీనిపై ఎంతో మంది పిటిష‌న‌ర్లు హైకోర్టు గ‌డ‌ప తొక్కారు. దీంతో హైకోర్టు ఆదేశాల మేర‌కు జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ కూడా ఓ క‌మిటీ ఏర్పాటు చేసి దీనిపై విచార‌ణ జ‌రిపింది. జులై 15న దీనికి సంబంధించిన తుది నివేదిక‌ను కోర్టుకు స‌మ‌ర్పించింది. అధికార పార్టీ మ‌ద్ద‌తుదారులు ప్ర‌తిప‌క్ష పార్టీ మ‌ద్ద‌తుదారుల‌పై జ‌రిపిన ప్ర‌తీకార హింస‌గా దీనిని క‌మిటీ అభివ‌ర్ణించింది. హ‌త్య‌, అత్యాచారం వంటి తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు ఉన్న నేప‌థ్యంలో కేసు విచార‌ణ‌ను సీబీఐకి అప్ప‌గించాల‌ని, అంతేకాదు ఈ విచార‌ణ రాష్ట్రం బ‌య‌ట జ‌ర‌గాల‌ని కూడా స్ప‌ష్టం చేసింది. కాగా,

    హింసకు సంబంధించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా బీజేపీ నేతలు చేస్తోన్న న్యాయపోరాటం సీఎం మమతకు ఇరకాటంగా మారింది. కేసుల దర్యాప్తును సీబీఐకి, కోర్టు ఆధ్వర్యంలోని సిట్ కు అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించే దిశగా టీఎంసీ సర్కారు యోచన చేస్తున్నది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+