బెంగాల్ సీఎస్ సంచలనం: కారు డోర్ వల్లే మమతకు గాయం, ఈసీకి రిపోర్ట్..
నందిగ్రామ్లో మమతా బెనర్జీ కాలుకు అయిన గాయం సర్వత్రా చర్చకు దారితీసింది. కొందరు తనపై దాడి చేశారని మమతా ఆరోపించగా.. ప్రత్యక్ష సాక్షులు మాత్రం అదేం లేదని చెప్పారు. కారు డోర్ తగిలి గాయం అయ్యిందని వివరించారు. వారు చెప్పినట్టే బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక కూడా అందజేశారు.

ఈసీకి బెంగాల్ సీఎస్ అలపన్ భండోపాధ్యాయ్ రిపోర్ట్ అందజేశారు. దానిని ఈసీ సభ్యులు చదివి.. డిస్కష్ చేసుకున్నారు. కారు డోర్ వల్ల కాలుకి గాయం జరిగిందని.. అయితే అలా జరగానికి కారణం ఏంటో తెలియలేదు. ఆ డోర్ ఎవరూ వేశారనే అంశంపై స్పష్టత లేదు అని టీఎంసీ అంటోంది. అందువల్లే ఆమె కాలుకి గాయం జరిగినట్టు ఉంటుందని వారు ఇప్పటికీ చెబుతున్నారు.
ఈ నెల 10వ తేదీన మమత కాలికి గాయం జరిగిన సమయంలో చాలా మంది గుమిగూడి ఉన్నారని సీఎస్ పేర్కొన్నారు. కరెంట్ స్తంభం మమతా ఉన్న వాహనానికి చాలా దూరంలో లేదని వివరించారు. అందువల్లే కారు డోర్ తీసేప్పుడు పోల్ ఉందని.. తీసే క్రమంలో గాయం జరిగి ఉండొచ్చనే అభిప్రాయపడ్డారు. మరోవైపు బీజేపీ ప్రతినిధుల బృందం ఈసీని కలిశారు. వీడియో అందజేశామని.. అదీ ప్రజలకు చూపించాలని కోరామని వివరించారు. నందిగ్రామ్, ఇతర నియోజకవర్గాలు సున్నితమైనవని.. అందుకే జాగ్రత్తగా ఉండాలని కోరారు. మరోవైపు రెండురోజులు ఆస్పత్రిలో ఉన్న మమతా బెనర్జీ డిశ్చార్జ్ అయ్యారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications