తిరుగుబాటు లెవనెత్తిన ఎమ్మెల్యే ఇంటికి కుమారస్వామి
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) సంకీర్ణ కూటమి ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి ప్రధాన కారకుల్లో ఒకరైన రామలింగా రెడ్డి ఇంటికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి వెళ్లారు. గురువారం ఉదయం బెంగళూరు లక్కసంద్రలోని రామలింగా రెడ్డికి వెళ్లిన ఆయన అక్కడే అల్పాహారం తీసుకున్నారు. బెంగళూరులోని బీటీఎం లేఅవుట్ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
కర్ణాటక కాంగ్రెస్లో మొదటగా తిరుగుబాటును తీసుకొచ్చింది రామలింగా రెడ్డే. ఇదివరకు సిద్ధరామయ్య ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. కుమారస్వామి విధానాలు నచ్చకపోవడం వల్ల ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం మనసు మార్చుకున్నారు. రాజీనామాను ఉపసంహరించుకున్నారు. అప్పటికే- జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తిరుగుబాటు రాజుకుంది. చివరి నిమిషంలో రామలింగా రెడ్డి వెనక్కి తగ్గినప్పటికీ.. మిగిలిన వారు తమ రాజీనామాలను వెనక్కి తీసుకోవడానికి మొరాయించారు.

సుమారు 40 నిమిషాల పాటు కుమారస్వామి ఆయన నివాసంలో గడిపారు. ఆ సమయంలో రామలింగా రెడ్డి కుమార్తె జయనగర ఎమ్మెల్యే సౌమ్యా రెడ్డి అక్కడే ఉన్నారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. తన రాకకు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని కుమారస్వామి చెప్పారు. మధ్యంతర ఎన్నికలు వస్తాయా? అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలను దాటవేశారు. ఏ విషయాన్నైనా ఇప్పుడే చెప్పడం సరికాదని కుమారస్వామి అన్నారు.
-
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !!











Click it and Unblock the Notifications