మరో ఘోరం.. విమానాన్ని ఢీ కొట్టిన కార్గో ట్రక్..
ముంబై ఎయిర్ పోర్టులో షాకింగ్ ఘటన జరిగింది. విమానాశ్రయంలో పార్కింగ్ చేసి ఉన్న ఆకాశ ఎయిర్ లైన్స్ విమానాన్ని సరుకులను తరలించే ఓ ట్రక్కు ప్రమాదవశాత్తు ఢీ కొట్టింది. వెంటనే అక్కడకు చేరుకున్న ఎయిర్ పోర్టు సిబ్బంది.. విమానాన్ని పూర్తిస్థాయిలో తనిఖీ చేశారు. దెబ్బ తిన్న భాగానికి మరమ్మతులు చేపట్టారు. ఆ ట్రక్కును విమాన సిబ్బంది కాకుండా ఓ థర్డ్ పార్టీ వ్యక్తి నడిపినట్లు గుర్తించారు అధికారులు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
ఇటీవల దేశవ్యాప్తంగా విమాన ప్రమాదాలు అధికంగా నమోదవుతున్నాయి. నిత్యం సాంకేతిక సమస్యలతో విమానాలు ఎక్కడపడితే అక్కడ ల్యాండింగ్ అవుతున్నాయి. ఇటీవల గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో 265 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఆ తర్వాత ఉత్తరాఖండ్ లో ఓ హెలికాప్టర్ కుప్పకూలి ఏడుగురు మృతిచెందారు. ఇటీవలి కాలంలో అనేక విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. తాజాగా ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లోనూ ఇలాంటి ఘటనే జరిగింది.
An Akasa Air aircraft had a scare at the Mumbai airport when a third-party ground handler, while operating a cargo truck, inadvertently hit it, an official representing the carrier said on Monday.
— IndiaToday (@IndiaToday) July 14, 2025
The cargo truck came in contact with the Akasa Air aircraft that was parked at the… pic.twitter.com/5jwPRkVmJG
ముంబై ఎయిర్ పోర్టులో పార్కింగ్ చేసి ఉన్న ఆకాశ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానాన్ని ఓ కార్గో ట్రక్కు ఢీ కొట్టింది. ట్రక్కు బలంగా ఢీ కొట్టడంతో విమానం రెక్క కొంత భాగం ట్రక్కులోకి దూరింది. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు విమానాన్ని పూర్తిస్థాయిలో తనిఖీ చేపట్టారు.

అయితే ఆ సమయంలో విమానంలో ప్రయాణికులు లేకపోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. దెబ్బ తిన్న భాగానికి మరమ్మతులు చేపట్టారు. ఆ ట్రక్కును విమాన సిబ్బంది కాకుండా ఓ థర్డ్ పార్టీ వ్యక్తి నడిపినట్లు గుర్తించారు అధికారులు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
ఆకాశ ఎయిర్ లైన్స్ విమానం QP1410 ఎయిర్ పోర్ట్ లోని బే-7 లైన్ వద్ద పార్కింగ్ చేసి ఉంది. ఆ విమానం ముంబై నుంచి దిల్లీకి వెళ్లాల్సి ఉంది. అయితే జులై 14న ఉదయం 7 గంటల సమయంలో ఓ కార్గో ట్రక్ విమానాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో విమానం ఓ రెక్క దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు.
ఇదే విమానం QP1736 బెంగళూరు నుంచి ముంబై ప్రయాణం చేసి రావడంతో పార్కింగ్ స్థలంలో నిలిపివేశారు. ఈ క్రమంలోనే ఘటన జరిగింది. ఆ ట్రక్కును విమాన సిబ్బంది కాకుండా ఓ థర్డ్ పార్టీ వ్యక్తి నడిపినట్లు గుర్తించారు అధికారులు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications