ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేపై హత్యాయత్నం కేసు.. పార్టీ నుంచి సస్పెండ్
బెంగళూరు : కాంగ్రెస్ ఎమ్మెల్యే జె.ఎన్.గణేశ్ పై పోలీసులు చర్యలు తీసుకున్నారు. హత్యాయత్నం కింద ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. సెక్షన్ 307 ప్రకారం కేసు నమోదైంది. కాంగ్రెస్ పార్టీకే చెందిన మరో ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ తనపై గణేశ్ దాడి చేశారనే వాంగ్మూలం మేరకు పోలీసులు స్పందించారు. అపోలో ఆసుపత్రిలో ఆనంద్ సింగ్ కు చికిత్స కొనసాగుతోంది.
మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం గణేశ్ చర్యను ఖండించింది. సహచర ఎమ్మెల్యేపై దాడి చేసినందుకు ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పరమేశ్వర నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసిన పార్టీ పెద్దలు సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు.

కాంగ్రెస్ - జేడీఎస్ అలయెన్స్ గవర్నమెంటును దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనే ప్రచారం జరిగింది. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు ముందస్తు చర్యలకు సిద్ధమయ్యారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా వారిని శుక్రవారం నాడు ఓ రిసార్టుకు తరలించారు. అయితే శనివారం రాత్రి గణేశ్, ఆనంద్ సింగ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఘర్షణకు దారి తీసింది. దీంతో ఆనంద్ సింగ్ పై గణేశ్ దాడి చేయడం చర్చానీయాంశమైంది.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications