బ్యాంక్ రుణాల ఎగవేత: పంజాబ్ సీఎం అల్లుడ్ని ప్రశ్నించిన సీబీఐ
న్యూఢిల్లీ : బ్యాంకు రుణాలు ఎగవేసిన కేసులో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ అల్లుడు గురుపాల్ సింగ్ను గురువారం సీబీఐ ప్రశ్నించింది. సింభోలి షుగర్స్ కంపెనీ బ్యాంకు నుంచి రూ.97.85కోట్లు ఎగవేసిన కేసులో ఆయన నిందితుడని సీబీఐ అధికారులు పేర్కొన్నారు.
ఈ కేసులో ఆ సంస్థ మాజీ ముఖ్య పరిపాలనాధికారి సీఎజీ రావ్ను, ఛైర్మన్ గుర్మిత్ సింగ్ మాన్, డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గురుపాల్ సింగ్తోపాటు మరికొంతమందిని సీబీఐ ప్రశ్నించింది. దేశంలోని పెద్ద చక్కెర కర్మాగారాల్లో సింభోలి షుగర్స్ లిమిటెడ్ ఒకటిగా ఉంది.

ఈ వ్యవహారంలో కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ల ఇళ్లలో, ఢిల్లీ, హాపూర్, నోయిడాలోని పలు కార్యాలయాల్లో సీబీఐ సోదాలు చేపట్టింది. మొత్తంగా రెండు కేసులపై సీబీఐ విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. మొదటిది రూ.97.85కోట్లకు సంబంధించినది కాగా, ఆ రుణాన్ని తీర్చేందుకే మరోసారి రూ.110 కోట్ల కార్పొరేట్ రుణం పొందినట్లు సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది.
రెండోసారి తీసుకొని ఎగవేసిన రుణాన్ని నిరర్థక ఆస్తులుగా ప్రకటించారు. మొదట తీసుకొన్న రుణం రూ.97.85కోట్లే అయినా బ్యాంకుకు వాటిల్లిన నష్టం రూ.109.08కోట్లుగా సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. 2017 నవంబర్ 17 ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ తాము మోసపోయినట్లు సీబీఐ దృష్టికి తెచ్చింది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications