సీబీఐ కోర్టు సంచలనం: లంచగొండి భార్య, కొడుకు, కోడలుకూ శిక్ష
జబల్పూర్: అవినీతికి పాల్పడిన అధికారి మాత్రమే కాదు.. ఆయన అవినీతిని ఆపలేకపోయిన కుటుంబసభ్యులు కూడా నేరస్తులేనంటూ జబల్పూర్ సీబీఐ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న సూర్యకాంత్ గౌర్, రూ. 94 లక్షల ప్రభుత్వ నిధులను కాజేశారన్న ఆరోపణలపై కోర్టు విచారించింది.
విచారణ జరిపిన న్యాయమూర్తి యోగేష్ చంద్ర గుప్తా, సూర్యకాంత్తో పాటు ఆయన భార్య వనితా గౌర్, కుమారుడు శిశిర్ గౌర్, కోడలు సునీతా గౌర్లకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 2.5 లక్షల చొప్పున జరిమానా విధించారు.

జులై 14, 2010లో సీబీఐ అధికారులు గౌర్ ఇంటిపై దాడులు చేసి ఆదాయానికి మించి ఆస్తులున్నాయని కేసు పెట్టారు. ప్రభుత్వ నిధుల(రూ. 94లక్షల)ను తన ఖాతాలకు తరలించుకున్నాడని పక్కా సాక్ష్యాలు ఉండటంతో కోర్టు ఆయనతో పాటు కుటుంబమంతటికీ శిక్షను విధించింది.
కాగా, ఇంటిల్లిపాదీ జైలుకు వెళ్లడంతో, వారి విజ్ఞప్తి మేరకు శిశిర్ గౌర్ ఐదేళ్ల కుమారుడిని సైతం అధికారులు జైలుకు తరలించారు. అవినీతి అధికారులకు ఈ శిక్ష ఓ గుణపాఠం కావాలని ఓ న్యాయవాది అభిప్రాయపడ్డారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications