బొగ్గు కుంభకోణం కేసు: మన్మోహన్ సింగ్కు ఊరట
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు ఊరట లభించింది. బొగ్గు గనుల కేటాయింపుల్లో మన్మోహన్ ప్రమేయం లేదని సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. బొగ్గు కుంభకోణంలో మన్మోహన్ సింగ్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
ఈ కేసులో జార్ఖండ్ మాజీ సీఎం మధు కోడా, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి ఎస్సీ గుప్తాల్, పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్ సహా మొత్తం 14 మందిపై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది.
కాగా, బొగ్గు కుంభకోణం కేసులో మధుకోడా అభ్యర్థనకు యోగ్యత లేదని ప్రత్యేక కోర్టుకు సీబీఐ విన్నవించింది. బొగ్గు కుంభకోణంలో మాజీ ప్రధాని మన్మోహన్కు సమన్లు జారీ చేయాలని మధుకోడా చేసిన అభ్యర్థనపై సోమవారం ప్రత్యేక కోర్టు విచారణ జరిపింది.

ఈ సందర్భంగా ఈ కేసులో సీబీఐ తన వాదనలు విన్పించింది. జిందాల్ సంస్థకు బొగ్గు కేటాయించాలని మన్మోహన్ సూచించారన్న ఆరోపణలపై ఆధారాల్లేవని పేర్కొంది.
కాగా, ఈ కేసులో మన్మోహన్ సింగ్ను నిందితుడిగా చేర్చాలని మధుకోడా చేసిన వాదనను దాసరి నారాయణరావు సమర్థించారు. ఈ నేపథ్యంలో ఈ కేసును విచారిస్తున్న సీబీఐ మన్మోహన్కు క్లీన్ చిట్ ఇవ్వడం ఆయనకు ఉపశమనం కలిగించే విషయంగా చెప్పుకోవచ్చు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications