కుప్పకూలిన CBSE వ్యవస్థ.. ఐఐటీ నిపుణుల రంగప్రవేశం!

దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన విద్యామండలి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తీవ్ర విశ్వసనీయత సంక్షోభంలో కూరుకుపోయింది. 12వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనంలో జరిగిన ఘోర తప్పిదాలు, భౌతికశాస్త్రం (Physics), రసాయనశాస్త్రం (Chemistry) పేపర్లు తారుమారయ్యాయంటూ స్వయంగా బోర్డు అంగీకరించడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఒకరి జవాబు పత్రాలు మరొకరికి జతకావడం, పోర్టల్ క్రాష్‌లు, పునర్‌మూల్యాంకన గందరగోళంతో 17 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు అంధకారంలో పడింది. 'నీట్’ (NEET) లీకేజీ వివాదం సృష్టించిన గాయం మానకముందే.. సీబీఎస్‌ఈ దారుణాలు వెలుగులోకి రావడం విద్యార్థులను, తల్లిదండ్రులను తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తోంది.

మే 13న ఫలితాలు విడుదలైనప్పటి నుంచి సీబీఎస్‌ఈ ఆన్‌లైన్ సర్వర్లు పూర్తిగా కుప్పకూలాయి. స్కాన్ చేసిన జవాబు పత్రాల కోసం, రీ-వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకుందామనుకున్న విద్యార్థులకు 'సర్వర్ నాట్ అవైలబుల్’ అనే మెసేజ్‌లు, క్యాప్చా లోపాలు దర్శనమిచ్చాయి. వేలాది మందికి డబ్బులు కట్ అయినా 'పేమెంట్ ఫెయిల్డ్’ అని చూపించడం, ఒక దశలో నలుగురు విద్యార్థుల ఫోటోకాపీల కోసం ఏకంగా రూ.3 లక్షల భారీ ఫీజును పోర్టల్ స్క్రీన్‌పై చూపించడం బోర్డు నిర్వాహక లోపాలకు పరాకాష్టగా నిలిచింది.

పరిస్థితి చేయిదాటిపోవడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా రంగంలోకి దిగారు. కుప్పకూలిన బోర్డు పరీక్షా పోర్టల్‌ను కాపాడటానికి ఐఐటీ మద్రాస్, ఐఐటీ కాన్పూర్ నిపుణులను అత్యవసరంగా పిలిపించారంటేనే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.\

CBSE 12th Result Scandal Portal Crashes And Swapped Paper Blunders Spark Nationwide Demands For Manual Recheck

తలకిందులైన 'ఆన్-స్క్రీన్ మార్కింగ్’ (OSM) వ్యూహం

ఈ ఏడాది సీబీఎస్‌ఈ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన డిజిటల్ మూల్యాంకన విధానం 'ఆన్-స్క్రీన్ మార్కింగ్’ (OSM) పూర్తిగా విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 77,000 మంది ఉపాధ్యాయులకు ఈ సరికొత్త సాఫ్ట్‌వేర్‌పై కనీస అవగాహన, శిక్షణ కల్పించకుండానే హడావిడిగా అమలు చేశారు.

CBSE Class 12 Re-Test: మళ్లీ 12వ తరగతి పరీక్షలు ? తప్పులు ఒప్పుకున్న బోర్డు..!
CBSE Class 12 Re-Test: మళ్లీ 12వ తరగతి పరీక్షలు ? తప్పులు ఒప్పుకున్న బోర్డు..!

"కొత్త సిస్టమ్‌పై మాకు సరైన ట్రైనింగ్ ఇవ్వలేదు. సర్వర్ సమస్యలు, ఆలస్యంగా లోడింగ్ కావడం వల్ల ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఫలితంగానే మార్కింగ్ అస్తవ్యస్తంగా మారింది" అని లక్నో, సాహరన్‌పూర్‌కు చెందిన పలువురు పరీక్షాధికారులు బాహాటంగానే అంగీకరిస్తున్నారు.

పైగా, అప్‌లోడ్ చేసిన కొన్ని జవాబు పత్రాలు అంత్యంత అస్పష్టంగా ఉండటంతో అసలు మార్కులు ఎలా వేశారో కూడా తెలియని గందరగోళం నెలకొంది. దీని ప్రభావంతోనే గత ఏడేళ్లలో లేని విధంగా ఈసారి ఉత్తీర్ణత శాతం 85.20 శాతానికి పడిపోగా, 1.63 లక్షల మంది విద్యార్థులు కంపార్ట్‌మెంట్ కేటగిరీకి పరిమితమయ్యారు.

రీ-టెస్ట్ సాధ్యమేనా? 'లాజిస్టికల్ పీడకల’!

పేపర్లు తారుమారైన నేపథ్యంలో 12వ తరగతి విద్యార్థులందరికీ మళ్లీ పరీక్ష (Re-Test) నిర్వహించాలనే డిమాండ్ వినిపిస్తున్నప్పటికీ.. అది ఆచరణలో అసాధ్యమనే వాదనలు వినిపిస్తున్నాయి. దేశ, విదేశాల్లో కలిపి 17.6 లక్షల మందికి పైగా విద్యార్థులకు మళ్లీ ప్రశ్నపత్రాలు ముద్రించడం, పరీక్షా కేంద్రాలను కేటాయించడం, ఇన్విజిలేటర్లను నియమించడం ఒక భారీ 'లాజిస్టికల్ పీడకల’గా మారుతుంది.

ఇప్పటికే జేఈఈ, నీట్, సీయూఈటీ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లతో విద్యా క్యాలెండర్ నిండిపోయింది. 2018లో ఎకనామిక్స్ పేపర్ లీకైనప్పుడు రీ-టెస్ట్ పెట్టి చేతులు కాల్చుకున్న చేదు జ్ఞాపకం సీబీఎస్‌ఈకి ఉంది.

సీబీఎస్ఈ పరీక్ష లోపాల పుట్ట-ప్రశ్నిస్తే దేశద్రోహులా? - రాహుల్ ఫైర్..!
సీబీఎస్ఈ పరీక్ష లోపాల పుట్ట-ప్రశ్నిస్తే దేశద్రోహులా? - రాహుల్ ఫైర్..!

పరిష్కారం ఏంటి? మాన్యువల్ రీచెక్ ఒక్కటే మార్గం!

ప్రముఖ కెరీర్ కౌన్సిలర్ జయప్రకాష్ గాంధీ విశ్లేషణ ప్రకారం.. పూర్తిస్థాయి రీ-టెస్ట్ అనేది విద్యార్థులపై మరింత భావోద్వేగ భారాన్ని మోపుతుంది. దీనికి బదులుగా బోర్డు తక్షణమే నష్టనివారణ చర్యలు చేపట్టాలి.

  • మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, ఎకనామిక్స్ వంటి కీలక సబ్జెక్టుల పేపర్లను మాన్యువల్ పద్ధతిలో (భౌతికంగా) రీ-వెరిఫికేషన్ చేయాలి.
  • ఇప్పటికే నీట్ పరీక్షల వివాదంతో విద్యా క్యాలెండర్ కాస్త ఆలస్యమైంది కాబట్టి, ఈ మాన్యువల్ రీచెక్ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన నెల రోజుల్లో పూర్తి చేయవచ్చు.
  • విద్యార్థుల్లో నమ్మకాన్ని పునరుద్ధరించడానికి ప్రస్తుతం విధిస్తున్న రూ.100 రీచెక్ రుసుమును బోర్డు తక్షణమే రద్దు చేయాలి.

భారతదేశంలో బోర్డు పరీక్షలు కేవలం మార్కుల జాబితా కాదు.. అవి విద్యార్థుల ఉన్నత చదువులను, కెరీర్ మార్గాలను శాసించే కీలక మైలురాళ్లు. ఒక వెబ్‌సైట్ సరిగ్గా లోడ్ అవ్వకపోవడం వల్ల, మూల్యాంకన అధికారుల నిర్లక్ష్యం వల్ల లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు రోడ్డున పడితే, అది దేశ విద్యా వ్యవస్థ వైఫల్యంగానే మిగిలిపోతుంది. ఇప్పటికైనా సీబీఎస్‌ఈ సాంకేతిక సాకులు వెతకడం మానేసి, బాధితులకు న్యాయం చేయాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+