CBSE సంచలన నిర్ణయం: ఒకే ఏడాది వేర్వేరు సిలబస్తో రెండు విడతల్లో బోర్డు పరీక్షలు -పూర్తి వివరాలివే
కరోనా మహమ్మారి దెబ్బకు విద్యారంగం తీవ్రంగా ప్రభావితం కావడం, రాబోయే రోజుల్లో మరిన్ని వేవ్ లు తలెత్తితే చదువులు కుదేలయ్యే అవకాశాలుండటంతో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర విద్యా శాఖ పరిధిలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) తన నూత సిలబస్ విధానాన్ని సోమవారం ప్రకటించింది.
2021-22 విద్యా సంవత్సరంలో 10, 12 తరగతుల బోర్డు పరీక్షలకు సంబంధించి సీబీఎస్ఈ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. కరోనా భయాల నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరాన్ని రెండు విభాగాలుగా విభజించినట్లు వెల్లడించింది. ఈ మేరకు 50 శాతం సిలబస్ చొప్పున 10, 12 తరగతులకు రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటనలో తెలిపారు.

కొత్త విధానం ప్రకారం ఒకే విద్యా సంవత్సరంలో రెండు సార్లు బోర్డు పరీక్షలుంటాయి. ఏదైనా అవాతరంతో ఒక పరీక్ష రద్దయితే, వచ్చిన మార్కులని తీసుకుని మొత్తం విడుదల చేస్తారు. ఈ రెండు టర్ముల్లో సిలబస్ కూడా వేరే విధంగా ఉంటుంది. మొదటి అర్థ సంవత్సరానికి 50శాతం సిలబస్ ఉంటుంది. రెండవ టర్మ్ కి మిగతా యాభైశాతం సిలబస్ ఉంటుందని సీబీఎస్ఈ పేర్కొంది. కాగా,
మారిన విధానంలో పరీక్షల సమయం 90నిమిషాలుగానే ఉంటుందని, మార్కింగ్ స్కీమ్ ఆధారంగా క్వశ్చన్ పేపర్ ని సీబీఎస్ఈ తయారు చేస్తుందని, సీబీఎస్ఈ నియమించిన అధికారుల సమక్షంలోనే పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ ఏడాది నవంబర్-డిసెంబర్లో తొలి విడత పరీక్షలు, వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్లో రెండో విడత బోర్డు పరీక్షలు జరుపనున్నట్లు సీబీఎస్ఈ ప్రకటించింది. 10, 12వ తరగతులకు టెర్మ్ల వారీగా సిలబస్ను ఈ నెలాఖరున ప్రకటిస్తామని చెప్పింది. ఈ విషయాలను కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిషాంక్ సైతం నిర్ధారించారు.

సీబీఎస్ఈ విద్యార్థుల ఇంటర్నల్ అసెస్మెంట్, ప్రాజెక్ట్ వర్స్ను మరింత విశ్వసనీయంగా నిర్వహించేలా ప్రయత్నిస్తున్నామని, కరోనా నేపథ్యంలో గత విద్యా సంవత్సరంలో బోర్డు పరీక్షలు నిర్వహించలేనందున ఈ ఏడాది రెండు విడతలుగా బోర్డు పరీక్షలు నిర్వహించాలని సీబీఎస్ఈ నిర్ణయించిందని మంత్రి పోఖ్రియాల్ పేర్కొన్నారు. ఒకవేళ మార్చిలో పరిస్థితులు అనుకూలంగా లేకపోతే 2గంటల బోర్డు పరీక్షను పెట్టాలని కూడా సీబీఎస్ఈ భావిస్తుంది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications