మారిన జనగణన రూపు-స్వయంగా నమోదుకు ఛాన్స్-డిజిటల్ సేకరణకూ కేంద్రం ఆమోదం
దేశవ్యాప్తంగా 10 ఏళ్లకోసారి జరిగే జనగణన 2021లో చేపట్టాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి ఆటంకాలతో అది కాస్తా ముందుకుసాగలేదు. దీంతో కేంద్రం, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా కనీసం ఈ ఏడాది అయినా జనగణనను పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా జనాభా లెక్కల వివరాలను స్వయంగా జనంతోనే నమోదు చేయించే ప్రక్రియతో పాటు డిజిటల్ విధానంలోనూ వివరాలు తీసుకునేలా నిబంధనల్ని సవరించారు. ఈ మేరకు కేంద్రం సవరణలకు ఆమోదముద్ర వేసింది.
జనగణన వివరాలను ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో తీసుకోవడానికి, నిల్వ చేయడానికి, అలాగే ప్రజల నుంచి స్వీయ-గణనను అనుమతించడానికి 1990లో రూపొందించిన జనాభా గణన నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. కోవిడ్ కారణంగా నిరవధికంగా వాయిదా వేయబడిన దశాబ్దాల జనాభా గణన కార్యక్రమం మొదటిసారిగా డిజిటల్ మోడ్తో పాటు పేపర్ షెడ్యూల్ల ద్వారా నిర్వహించబోతున్నారు. జనగణన 2021 తొలి దశ జాతీయ జనాభా రిజిస్టర్ ఎన్.పి.ఆర్.ని అప్డేట్ చేయడంతో పాటుగా ఇళ్ల వివరాలు, హౌసింగ్ సెన్సస్ 2020 ఏప్రిల్-సెప్టెంబర్ నుంచి జరగాల్సి ఉంది. కానీ కరోనా ప్రభావంతో నిరవధికంగా వాయిదా పడింది. ఈ జనగణన రెండో దశ మార్చి 5, 2021 నాటికి ముగియాలి. కానీ అది కూడా సాధ్యం కాలేదు. దీంతో కేంద్రం తాజా నిర్ణయాలు తీసుకుంది.

ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ మోడ్ల ద్వారా దాదాపు 650-800 మంది వ్యక్తుల వివరాలను సేకరించే బాధ్యతను ఎక్కువగా ప్రభుత్వ అధికారులు మరియు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులుగా ఉన్న దాదాపు 30 లక్షల మంది ఎన్యూమరేటర్లకు అప్పగించారు. మార్చి 11న రిజిస్ట్రార్-జనరల్ ఆఫ్ ఇండియా గెజిట్లో సవరించిన జనగణన నిబంధనలను కేంద్రం తాజాగా నోటిఫై చేసింది. దీని ప్రకారం ఓ వ్యక్తి స్వీయ-గణన ద్వారా జనాభా గణన షెడ్యూల్ను పూర్తి చేసి సమర్పించేలా అవకాశం కల్పించారు. ఎలక్ట్రానిక్ విధానంలో జనాభా గణన చేపట్టి స్వీయ గణనకు అనుమతిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించినప్పటికీ, నిబంధనలను సవరించి అధికారికంగా ప్రకటన జారీ చేసింది.
-
బరువు తగ్గాలంటే చనా వెజ్ సలాడ్ ఇలా ట్రై చెయ్యండి! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట!












Click it and Unblock the Notifications