లోక్ సభ ముందుకు క్రిమినల్ చట్టాల సవరణ బిల్లులు-తీవ్రవాద నిర్వచనంలో మార్పులివే..!
దేశంలో కాలం చెల్లిన బ్రిటీష్ చట్టాలను సవరిస్తూ కేంద్రం తీసుకొస్తున్న మూడు సవరణ బిల్లుల్ని హోంమంత్రి అమిత్ షా ఇవాళ లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఇందులో కేంద్రం పలు కీలక మార్పులు చేసింది. వీటిలో తీవ్రవాద నిర్వచనాన్ని కూడా మార్చేసింది. ఇకపై ఆర్ధిక అంశాల్లో చేసే నేరాలను కూడా తీవ్రవాదంగా పరిగణిస్తూ కేంద్రం చేసిన మార్పులపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ బిల్లులపై శుక్రవారం లోక్ సభలో ఓటింగ్ జరగబోతోంది.
దేశంలోని క్రిమినల్ చట్టాల స్థానంలో మూడు సవరణ బిల్లులను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టారు. చట్టాల్లోని కొన్ని సెక్షన్లను సవరిస్తూ, చాలా సవరణలు వ్యాకరణ దిద్దుబాట్లేనని తెలిపారు. ఈ మూడు చట్టాల్లో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యం చట్టం ఉన్నాయి. వీటిలో కేంద్రం పలు మార్పుల్ని ప్రతిపాదిస్తోంది. వీటిపై ఈ వారం చర్చ తర్వాత శుక్రవారం ఓటింగ్ చేపట్టేందుకు కేంద్రం సిద్దమవుతోంది.

మరోవైపు నిందితులకు రక్షణగా మానసిక అనారోగ్యం స్థానంలో అసౌఖ్యంతో సహా పార్లమెంటరీ ప్యానెల్ సూచించిన కొన్ని మార్పులను చేసేందుకు వీలుగా కొత్త ముసాయిదా చట్టాలను తీసుకురావడానికి లోక్సభ నుండి మూడు కొత్త క్రిమినల్ చట్ట బిల్లులను ఉపసంహరించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. మరోవైపు ఈ చట్టాల్లో ప్రతిపాదిస్తున్న సవరణల్లో తీవ్రవాదం నిర్వచనాన్ని కూడా పునర్ నిర్వచించబోతున్నారు.
నకిలీ కరెన్సీని వ్యాప్తి చేయడం లేదా కిడ్నాప్ చేయడం, గాయపరచడం లేదా మరణానికి కారణమయ్యే చర్యల ద్వారా దేశం యొక్క ఆర్థిక, ద్రవ్య భద్రతకు ముప్పు కలిగించడం వంటి అంశాల్ని తీవ్రవాదం నిర్వచనంలో చేర్చుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇవి భారతీయ న్యాయ సంహిత లేదా బీఎన్ఎస్ కి ప్రతిపాదించబడిన సవరణల్లో ఉన్నాయి. ఇది ప్రస్తుత క్రిమినల్ చట్టాలను భర్తీ చేసే మూడు బిల్లులలో ఒకటి.












Click it and Unblock the Notifications