డ్రగ్స్ కేసులపై కేంద్రం కీలక నిర్ణయం- తక్కువ మొత్తంలో తీసుకునే వాళ్లకు ఊరట
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో డ్రగ్స్ కలకలం పెరుగుతోంది. దేశీయంగా తయారవుతున్న డ్రగ్స్, గంజాయికి తోడు విదేశాల నుంచి వస్తున్న హెరాయిన్ వంటి డ్రగ్స్ ఇప్పుడు దేశ భవిష్యత్తుకు సవాళ్లు విసురుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంలోని సామాజిక మంత్రిత్వశాఖ రెవెన్యూశాఖకు కీలక సూచన చేసింది. డ్రగ్స్ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై రెవెన్యూ శాఖ ఈ మేరకు సూచనలు చేయాలని కోరడంతో సామాజిక మంత్రిత్వశాఖ తన అభిప్రాయం చెప్పింది.
దేశవ్యాప్తంగా డ్రగ్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చిన్న మొత్తంలో వ్యక్తిగతంగా డ్రగ్స్ తీసుకుంటున్న వారినీ, భారీ మొత్తంలో డ్రగ్స్ తీసుకిుంటూ,రవాణా, వ్యాపారానికి సహకరిస్తున్న వారినీ ఒకే గాటన కట్టడాన్ని సామాజిక న్యాయ మంత్రిత్వశాఖ తప్పుబట్టింది. ఈ మేరకు చిన్న మొత్తంలో సొంతానికి డ్రగ్స్ తీసుకుంటున్న వారిని నేర రహితంగా మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రెవెన్యూశాఖకు పలు సూచనలు చేసింది. ఈ సూచనలు అమలైతే చిన్న మొత్తంలో డ్రగ్స్ తీసుకుంటున్న వారు ఇకపై జైలు ఊచలు లెక్కించాల్సిన అవసరం ఉండదు.

చిన్న మొత్తంలో డ్రగ్స్ తీసుకునే వారిని నేర రహితంగా మార్చే క్రమంలో వారిని జైళ్లకు పంపే బదులు డీఅడిక్షన్ సెంటర్లకు, పునరావాస కేంద్రాలకు పంపాలని సామాజిక న్యాయమంత్రిత్వశాఖ రెవెన్యూ శాఖను కోరింది. ఈ మేరకు ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ చట్టం NDPSలో సవరణలు చేయాలని ప్రతిపాదించింది.
ఇలా చిన్న మొత్తంలో డ్రగ్స్ తీసుకునే వారిని సైతం జైళ్లకు పంపడం మొదలుపెడితే దేశంలో పెను మార్పులు తప్పవని హెచ్చరించింది. ఓవైపు డ్రగ్స్ తయారు చేస్తున్న వారిని, వ్యాపారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటూనే, మరోవైపు చిన్న మొత్తాల్లో వ్యక్తిగతంగా వాడే వారిని డీఅడిక్షన్ సెంటర్లు, పునరావాస కేంద్రాలకు పంపడం ద్వారా డ్రగ్స్ కల్చర్ కు అడ్డుకట్ట వేయాలని సామాజిక న్యాయమంత్రిత్వశాఖ సూచిస్తోంది. దీంతో కేంద్రం ఇప్పుడు ఈ సూచనల్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది.
-
3 ప్రభుత్వ బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. రూల్స్ బ్రేక్ చేస్తే ఊరుకునేదే లేదంటూ !! -
LPG పై కేంద్రం మరో గుడ్ న్యూస్ -రాష్ట్రాలకు లేఖలు..! -
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
రేవంత్ కు కేంద్రం బంపర్ బొనాంజా , 2028 తర్వాతా - మారుతున్న లెక్కలు..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ?












Click it and Unblock the Notifications