Article 370: జమ్మూ కాశ్మీర్ విభజనపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..!!
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి హోదా కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370 రద్దు వ్యవహారం.. దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. ఈ విషయంలో జోక్యం చేసుకోనుంది. సమగ్రంగా విచారణ చేపట్టడానికి రంగం సిద్ధం చేసింది. దీనికి ముహూర్తాన్ని కూడా నిర్ధారించింది. దసరా సెలవులు ముగిసిన వెంటనే విచారణకు స్వీకరించనుంది. ఆర్టికల్ 370 రద్దయిన మూడు సంవత్సరాల తరువాత సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయాన్ని వెలువడిస్తుందనేది ఆసక్తి రేపుతోంది.
జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి గల రాష్ట్ర హోదాను కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ సంకీర్ణ కూటమి 2019లో కేంద్రంలో వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని నెలకొల్పిన అతి కొద్దిరోజుల్లోనే ఆర్టికల్ 370 రద్దయింది. దీనికి సంబంధించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం అదే ఏడాది అక్టోబర్లో పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదింపజేసుకుంది.

ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో పాటు జమ్మూ కాశ్మీర్ను రెండుగా విభజించింది. కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్, లఢక్ పేరుతో రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా కేంద్ర పాలిత ప్రాంతాలు ఆవిర్భవించాయి. ఈ బిల్లును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. అర్జంట్ హియరింగ్ కింద లిస్టింగ్ చేయాలంటూ పిటీషన్దారు చేసిన విజ్ఞప్తికి సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. దసరా సెలవుల తరువాత విచారణ ఉంటుందని హామీ ఇచ్చింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, సభ్యుల్లో ఒకరైన జస్టిస్ సుభాష్ రెడ్డి ఈ ఏడాది పదవీ విరమణ చేశారు. వారు ప్రస్తుతం అందుబాటులో లేకపోవడం వల్ల ఈ బెంచ్ను పునర్నిర్మించాల్సి ఉంటుందని ఇప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ అన్నారు. దసరా సెలవులు ముగిసిన వెంటనే దీన్ని విచారణకు స్వీకరిస్తామని స్పష్టం చేశారు. దీనితో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పును ఇస్తుందనే విషయంపై ఆసక్తి ఏర్పడింది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications