కేరళలో తొలి దళిత పూజారి: బాధ్యతలు స్వీకరించిన యేదు కృష్ణన్
కేరళలో తొలి దళిత పూజారిగా యేదు కృష్ణన్ అనే వ్యక్తి చరిత్ర సృష్టించారు. తిరువళ్లకు సమీపంలోని మణప్పురం శివాలయ అర్చకునిగా సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు.
తిరువనంతపురం: కేరళలో తొలి దళిత పూజారిగా యేదు కృష్ణన్ అనే వ్యక్తి చరిత్ర సృష్టించారు. తిరువళ్లకు సమీపంలోని మణప్పురం శివాలయ అర్చకునిగా సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు.
ట్రావన్కోర్ దేవాలయ మండలి ఇటీవల 36 మంది బ్రాహ్మణేతరులను పూజారులుగా ఎంపిక చేసింది. వీరిలో ఆరుగురు దళితులు. శబరిమల అయ్యప్పస్వామి ఆలయం సహా 1248 దేవాలయాల ఈ మండలి పర్యవేక్షిస్తోంది.
సంస్కృతంలో పీజీ విద్యను అభ్యసిస్తున్న యేదు కృష్ణన్ గత పదేళ్లుగా పూజాక్రతువులను నేర్చుకున్నారు. తన గురువు కేకే అనిరుద్ధన్ తంత్రి నుంచి ఆశీర్వాదం పొందాక కృష్ణన్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ప్రధాన అర్చకులు గోపకుమార్ నంబూద్రి మంత్రోచ్ఛారణల మధ్య కృష్ణన్ ఆలయ ప్రవేశం చేశారు
1936 నవంబరు 12న ట్రావన్కోర్ సంస్థానం నిమ్నకులాల వారికి ఆలయ ప్రవేశ అర్హతను కల్పిస్తూ శాసనం చేసింది. ఆ ప్రకటన వెలువడి 81 ఏళ్లు పూర్తికావస్తున్న సమయంలో దళిత వ్యక్తి పూజారిగా బాధ్యతలు స్వీకరించటం విశేషం.