జాతీయగీతం వస్తుంటే నిలబడలేదు, దాడి: కేసు నమోదు
చెన్నై: సినిమా థియేటర్లలో జాతీయగీతం వస్తున్న సమయంలో అవమానకరంగా వ్యవహిరించిన ఘటనపై పోలీస్ కేసు కేసు నమోదు చేశారు. తమిళనాడు రాజధాని చెన్నైలోని కాశీ థియేటర్లో జాతీయ గీతం ప్రసారమవుతుండగా లేచి నిలబడని ఏడుగురు వ్యక్తులపై ఈ కేసు నమోదు చేశారు. విజయకుమార్ అనే వ్యక్తి, అతని స్నేహితులు ఈ థియేటర్ లో సినిమాకు వెళ్లారు.
సినిమా ప్రదర్శనకు ముందుగా జాతీయగీతం ప్రసారం చేయాలనే సుప్రీంకోర్టు ఆదేశాలలో భాగంగా ఈ థియేటర్లో జాతీయ గీతాన్ని ప్రసారం చేశారు. అయితే, జాతీయగీతం వస్తున్న సమయంలో కొందరు సీట్లలో కూర్చున్న వారు లేచి నిలబడలేదు. అంతేగాక, సెల్ఫీలు తీసుకుంటూ అలానే కూర్చున్నారు. దీంతో, విజయకుమార్, అతని స్నేహితులు వారిని నిలబడమని చెప్పినా వారు పట్టించుకోలేదు.

దీంతో, రెండు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో గొడవకు దారితీసింది. సినిమా విడుదలైన తర్వాత విజయ్ కుమార్ అక్కడి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఈ మేరకు ఫిర్యాదు చేశాడు. దీంతో, నిందితులపై జాతీయ గౌరవ చట్టం 1971 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు ఏడుగురిలో ఒక మహిళ కూడా ఉంది.
కాగా, నిందితులు చెబుతున్న కథనం మరో విధంగా ఉంది. జాతీయగీతం వస్తున్న సమయంలో తమను నిలబడాలని చెప్పిన విజయ్ కుమార్ బృందం సినిమా ఇంటర్వెల్ సమయంలో తమపై దాడి చేశారని నిందితుల్లో ఒకరైన లీనస్ రోఫన్ ఆరోపించాడు. తమపై దాడి చేసిన విజయ్ కుమార్ బృందంపై కూడా తిరిగి కేసు పెట్టామని చెప్పాడు.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications