వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోబ్రా జవాన్ రాకేశ్వర్ సేఫ్, ఇదిగో ఫోటో -మావోయిస్టుల అనూహ్య ఎత్తుగడలు -అడవిలోకెళ్లిన మధ్యవర్తులు

|
Google Oneindia TeluguNews

ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో నిత్యం భద్రతా బలగాలతో తలపడే మావోయిస్టులు ఈసారి అనూహ్య ఎత్తుగడలను అవలంబిస్తున్నారు. ఈనెల 3న బీజాపూర్-సుక్మా జిల్లాల సరిహద్దులోని టెర్రాం అటవీ ప్రాంతంలో వ్యూహాత్మకంగా దాడి చేసి 24 మంది జవాన్లను చంపేసిన నక్సల్స్.. ఒక జవాన్ ను బందీగా తీసుకెళ్లాను. అనంతరం అతని విడుదలకు సిద్ధమంటూ ఓ సుదీర్ఘ లేఖను విడుదల చేయడం, అందులో కేంద్ర, రాష్ట్రాలపై ఆరోపణలు గుప్పించడం, ఎన్ కౌంటర్ తాలూకు డ్రోన్ వీడియోను సైతం విడుదల చేశారు. తాజాగా తమ చెరలో ఉన్న కోబ్రా జవాన్ రాకేశ్వర్ సింగ్ మన్హాస్ ఫొటోను కూడా మావోయిస్టులు విడుదల చేశారు..

Recommended Video

#CRPFJawan #RakeshwarSingh చత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ : రాకేశ్వర్ క్షేమం...ఫొటో విడుదల

షాకింగ్: జగన్‌పై సర్పయాగం -అంతు తేల్చేదాకా ఏపీలో అడుగు పెట్టను - నాకు ప్రధాని అండ: ఎంపీ రఘురామషాకింగ్: జగన్‌పై సర్పయాగం -అంతు తేల్చేదాకా ఏపీలో అడుగు పెట్టను - నాకు ప్రధాని అండ: ఎంపీ రఘురామ

జవాన్ రాకేశ్వర్ సేఫ్..

జవాన్ రాకేశ్వర్ సేఫ్..

తమ చెరలో ఉన్న సీఆర్పీఎఫ్‌ కోబ్రా విభాగానికి చెందిన జవాన్‌ రాకేశ్వర్‌సింగ్‌ క్షేమంగా ఉన్నాడని మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది. అంతేకాదు క్షేమంగా ఉన్న జవాన్‌ ఫొటోను కూడా బుధవారం విడుదల చేశారు. ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో భీకర కాల్పుల తర్వాత కోబ్రా యూనిట్‌కు చెందిన రాకేశ్వర్‌సింగ్ అనే జవాన్ కనిపించకుండా పోయారు. అయితే ఆ జవాన్ తమ అదుపులో ఉన్నారని మావోయిస్టులు లేఖ ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. రాకేశ్వ సింగ్ విడుదల కోసం ఆయన కుటుంబీకులు కేంద్రం పెద్దలకు వినతులు చేస్తుండటం తెలిసిందే. తాటాకులతో నిర్మించిన తాత్కాలిక శిబిరంలో జవాన్ రాకేశ్వర్ వేరొకరితో మాట్లాడుతుండగా అతనికి తెలియకుండా తీసినట్లున్న ఫొటోను మావోయిస్టులు విడుదల చేశారు.

 వ్యూహాత్మకంగా అడుగులు..

వ్యూహాత్మకంగా అడుగులు..

24 మంది జవాన్ల మరణాలకు తాము కూడా చింతిస్తున్నామని, పోలీసులు తమకు శత్రువులు కారని, ఆదివారం నాటి దాడిలో తమ దళాలకు చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారని మావోయిస్టు పార్టీ ప్రకటించుకుంది. తమ చెరలోని జవాన్ ను విడుదల చేస్తామంటూ మావోయిస్టులు విడుదల చేసిన లేఖలో కీలకమైన అంశాలను ప్రస్తావించింది. 'ఆపరేషన్ ప్రహార్-3' అనే పేరుతో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహిస్తున్నారని, దేశంలో హక్కుల ఉద్యమాలను అణిచివేసేందుకు ప్రభుత్వాలు, పోలీసు బలగాలను ఉపయోగిస్తున్నాయని, పోలీసు బలగాలను తక్షణమే నిలిపివేయాలని మావోలు లేఖలో డిమాండ్ చేశారు. అదే సమయంలో మధ్యవర్తులను సూచించినట్లయితే జవాన్ ను విడిచిపెడతామని చెప్పారు. ఈలోపే దాడి ఘటనకు సంబంధించిన ఓ డ్రోన్ వీడియోను నక్సల్స్ విడుదల చేశారు. బుధవారం మధ్యాహ్నం జవాన్ రాకేశ్వర్ సింగ్ ఫొటోను కూడా బయటపెట్టారు. మొత్తంగా గడిచిన నాలుగు రోజులుగా మావోయిస్టులు భిన్నవాదనలను వినిపిండంలో దాదాపు సక్సెస్ అయ్యాయి. కాగా,

 అడవిలోకి వెళ్లిన మధ్యవర్తులు..

అడవిలోకి వెళ్లిన మధ్యవర్తులు..

బీజాపూర్‌ ఎన్‌కౌంటర్‌ సందర్భంగా మావోయిస్టులు తమ బందీగా చేసుకున్న జవాన్ రాకేశ్వర్ సింగ్ మన్హాస్ విడుదల కోసం చర్చలు మొదలయ్యాయి. 'జైలు బందీ విడుదల కమిటీ'లోని ఐదుగు సభ్యులు మధ్యవర్తులుగా వ్యవహరించేందుకు రెండు పక్షాలూ అంగీకరించడంతో చర్చల ప్రక్రియ ప్రారంభమైంది. కమిటీలోని ఐదుగురు సభ్యులు బుధవారం సాయంత్రానికే గ్రౌండ్ జీరోకు బయలుదేరారు. ప్రముఖ సామాజిక కార్యకర్త సోని సోరి కూడా ఈ బృందంలో ఉన్నారు. వీరు నక్సలైట్లతో సమావేశమై చర్చలు జరుపుతారు. అలాగే వారి డిమాండ్లను ప్రభుత్వానికి నివేదిస్తారు.

తెలంగాణ సరిహద్దులో విడుదల?

తెలంగాణ సరిహద్దులో విడుదల?

ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో పోలీసుల కూంబింగ్‌ ఎక్కువగా ఉండడంతో కోబ్రా జవాన్ రాకేశ్వర్ సింగ్ ను తెలంగాణ సరిహద్దుల్లోనే అప్పగించే యోచనలో మావోయిస్టులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మధ్యవర్తుల కమిటీ ఇప్పటికే బీజాపూర్‌ బయల్దేరి వెళ్లింది. ఈ బృందంతో పాటు సామాజిక కార్యకర్త సోని సోరితోపాటు కొంతమంది జర్నలిస్టులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఎక్కడ గుద్దాలో అక్కడ గుద్దుతారు -కోర్టు తీర్పుపై విజయసాయిరెడ్డి -పరిషత్ ఎన్నికల స్టేపై విచారణ వేళఎక్కడ గుద్దాలో అక్కడ గుద్దుతారు -కోర్టు తీర్పుపై విజయసాయిరెడ్డి -పరిషత్ ఎన్నికల స్టేపై విచారణ వేళ

English summary
A day after purportedly releasing a statement claiming that they abducted a jawan during a recent gun battle with security forces in Chhattisgarh's Bijapur district, the Maoists on Wednesday released the picture of missing Central Reserve Police Force’s Commando Battalion for Resolute Action (CoBRA) commando Rakeshwar Singh Minhas. Local journalists in Sukma and Bijapur claimed that they received the photograph sent by a Maoist leader.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X