మావోయిస్టుల హింస మధ్య ఛత్తీస్గడ్లో పోలింగ్
రాయపూర్: భారీ భద్రత, మావోయిస్టు దాడుల మధ్య ఛత్తీస్గడ్లో మొదటి దశలో 18 శాసనసభ నియోజకవర్గాలకు సోమవారం పోలింగ్ జరుగుతోంది. సోమవారం ఉదయం కొద్ది గంటల్లో బస్తర్, రాజనందగావ్ జిల్లాల్లో 10 - 12 శాతం పోలింగ్ జరిగింది. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.
బస్తర్లోని బలైంగా బూత్లో రిసైడింగ్ అధికారి రాజేంద్ర మహాపాత్ర గుండెపోటుతో మరణించినట్లు ప్రధాన ఎన్నికల అధికారి సునీల్ కుజూర్ చెప్పారు. అంబులెన్స్ సకాలంలో రాకపోవడంతో అతను పోలింగ్ బూత్లోని మరణించాడు. మారుమూల గ్రామం కావడంతో అక్కడికి అంబులెన్స్ చేరుకోవడం చాలా ఆలస్యమైంది.

మావోయిస్టు ప్రాబల్యం గల బస్తర్ జిల్లాలో భద్రతా బలగాలు విస్తృతమైన గాలింపు చర్యలు చేపట్టాయి. కాంకేర్ జిల్లాలోని పంఖజూర్ ప్రాంతంలో ఓ బాంబు దాడి జరిగింది. ఇందులో పోలీసు అధికారి గాయపడ్డాడు. అదే ప్రాంతంలో ఓ ప్రెషర్ బాంబును స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు.
కాగా, దంతేవాడ జిల్లాలో ఓ చోట మావోయిస్టులకు, భద్రతాబలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు సమాచారం. పోలింగ్ ప్రారంభం కావడానికి ముందు బిజాపూర్ మంకేలి ప్రాంతంలో రెండు రౌండ్ల కాల్పులు జరిగాయి. వివిధ ప్రాంతాల్లో చెదురుమొదరు సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే, మొత్తంగా ప్రశాంతంగానే పోలింగ్ జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. మావోయిస్టులు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చినప్పటికీ ప్రజలు వోటింగ్లో పాల్గొంటున్నారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications