మోడీతో సమావేశం రద్దుచేసుకొన్న చైనా , కారణమిదే!
జీ 20 దేశాల సదస్సులో తమ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ భారత్ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యే సాధారణ పరిస్థితులు లేవని చైనా స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: జీ 20 దేశాల సదస్సులో తమ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ భారత్ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యే సాధారణ పరిస్థితులు లేవని చైనా స్పష్టం చేసింది.
చైనాపై చర్యలు తప్పవన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్
భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీతో తమ అధ్యక్షుడు జిన్ పింగ్ సమావేశమయ్యే సాధారణ పరిస్థితులు లేవని చైనా ప్రకటించింది.హంబర్గ్ లో జీ 20 దేశాల సమావేశం జరగనుంది.
అయితే ఈ సమావేశంలో మోడీతో తమ దేశాధ్యక్షుడు జిన్ పింగ్ భేటీ ని రద్దుచేసుకొన్నట్టు చైనా ప్రకటించింది. సిక్కింలో ఏర్పడిన సరిహద్దు వివాదంపై గత కొద్దిరోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రస్తుతం ఇజ్రాయిల్ పర్యటనలో ఉన్న మోడీ ఇవాళ హంబర్గ్ వెళ్ళనున్నారు. జీ 20 దేశాల సదస్సులో భాగంగా ఆయా దేశాల నేతలను మోడీ మర్యాదపూర్వకంగా కలుసుకొంటారు. ఈ జాబితాలో తొలుత జీ జిన్ పింగ్ కూడ ఉన్నట్టు తెలిసినా, భారత్ నుండి మాత్రం అది ఉంటుందా లేదా అనే విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ లోపుగానే ప్రస్తుతం తమ అధ్యక్షుడు జిన్ పింగ్ భేటీని రద్దుచేసు కొంటున్నట్టు చైనా ప్రకటించింది.