చైనా అభ్యంతరం.. అయినా ఆగని నిర్మలా సీతారామన్!
కేంద్ర రక్షణమంత్రి నిర్మలాసీతారామన్ అరుణాచల్ప్రదేశ్ పర్యటనపైనా చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినా మన రక్షణ మంత్రి వెనకడుగు వేయలేదు. అరుణాచల్ ప్రదేశ్ అంజ్యా జిల్లాలోని కిబుతు సైనిక స్థావరాన్ని
బీజింగ్: చైనా ఇంకా మారలేదు. ప్రతిదీనికీ అభ్యంతరం వ్యక్తం చేసే తన బుద్ధిని అది ఇప్పటికీ మార్చుకోలేదు. తాజాగా కేంద్ర రక్షణమంత్రి నిర్మలాసీతారామన్ అరుణాచల్ప్రదేశ్ పర్యటనపైనా చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది.
అయినా మన రక్షణ మంత్రి వెనకడుగు వేయలేదు. అరుణాచల్ ప్రదేశ్ అంజ్యా జిల్లాలోని కిబుతు సైనిక స్థావరాన్ని ఆదివారం నిర్మలా సీతారామన్ సందర్శించారు. ఈ సైనిక స్థావరం చైనా సరిహద్దు వెంబడి ఉండడంతో అలవాటు ప్రకారమే ఆ దేశం అభ్యంతరం తెలిపింది.

భారత్, చైనా మధ్య అరుణాచల్ప్రదేశ్ విషయమై గతకొంతకాలంగా విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. అరుణాచల్ దక్షిణ టిబెట్లో భాగమే అని చైనా వాదన. దీంతో భారత్ నుంచి ఉన్నతాధికారులు ఎవరైనా అక్కడ పర్యటిస్తే చైనా పదే పదే తప్పుబడుతూ వస్తోంది.
తాజాగా రక్షణమంత్రి పర్యటనపై కూడా చైనా విదేశాంగశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ వివాదాస్పద ప్రాంతమని, ఇలాంటి పర్యటనలు అక్కడి శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తాయని చైనా ఆరోపించింది.
'అరుణాచల్ప్రదేశ్లో భారత రక్షణమంత్రి పర్యటన అంటే.. అక్కడ చైనా స్థానమేంటో మీరు స్పష్టంగా తెలుసుకోవాలి. భారత్-చైనా సరిహద్దు తూర్పు ప్రాంతంపై ఇరు దేశాల మధ్య వివాదం జరుగుతోంది. ఇలాంటి సమయంలో భారత్ నుంచి ఓ మంత్రి అక్కడ పర్యటిస్తే.. ఆ ప్రాంతంలో శాంతి భద్రతలకు భంగం కలుగుతుంది..' అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చునియింగ్ అన్నారు. అంతేకాదు, 'వివాదాన్ని పరిష్కరించేందుకు భారత్ చైనాతో కలిసి పనిచేస్తుందని ఆశిస్తున్నాం..' అని కూడా పేర్కొన్నారు.
-
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications