బిహార్ 'పవన్ కల్యాణ్' ఇతనే..!
ఉత్కంఠభరితంగా సాగిన బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించింది. కూటమి నేతలు కూడా ఊహించని విధంగా బిహార్ ఫలితాలు వెల్లడవుతున్నాయి. కూటమిలోని బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ పార్టీలు విజయ దుందుభి మోగిస్తున్నాయి. బీజేపీ, జేడీయూ పార్టీలకు ధీటుగా లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్) కూడా ఎన్నికల ఫలితాల్లో అదిరిపోయే ప్రదర్శన చేస్తుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 90 శాతం స్ట్రైక్ రేటుతో దూసుకెళ్తుంటే.. యువ పార్టీ ఎల్జేపీ సైతం చిరాగ్ పాసవాన్ సారధ్యంలో 75 శాతానికి పైగా స్ట్రైక్ రేటుతో విక్టరీ కొట్టింది. ఈ అఖండ విజయంలో ఆ పార్టీ అధినేత చిరాగ్ పాసవాన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. గత ఎన్నికల్లో ఒక్కటంటే.. ఒక్క స్థానానికే పరిమితమైన ఎల్జేపీ పార్టీ.. ఈ ఎన్నికల్లో 75 శాతానికి పైగా స్ట్రైక్ రేటుతో విజయం సాధించడంపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి దూసుకెళ్తోంది. దాదాపు 209 సీట్లతో ముందంజలో ఉంది. కూటమిలోని బీజేపీ, జేడీయూలకు ఏమాత్రం తీసిపోకుండా ఎల్జేపీ అద్భుత ప్రదర్శన చేసింది. ఆ పార్టీ ఈ ఎన్నికల్లో 75 శాతం స్ట్రైక్ రేటు సాధించి సత్తా చాటింది. ఎల్జేపీ అధినేత చిరాగ్ పాసవాన్ సారథ్యంలో బిహార్ రాజకీయాల్లో పార్టీ మరింత శక్తివంతంగా మారింది. 2020 ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుతో సరిపెట్టుకున్న ఎల్జేపీ.. ఈ ఎన్నికల్లో దాదాపు 75 శాతం స్ట్రైక్ రేటుతో దుమ్ము లేపింది. మొత్తం 29 అసెంబ్లీ స్థానాల్లో ఎల్ జేపీ పోటీ చేస్తే 19 స్థానాల్లో లీడ్ గా ఉంది. గతంలోనూ ఎల్జేపీ పార్టీ పోటీ చేసిన ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఐదు స్థానాలనూ కైవసం చేసుకుంది. ఈ సారి కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

2020 ఎన్నకల్లో ఎల్జేపీ ఒంటరిగానే బరిలోకి దిగింది. జేడీయూ అధినేత, సీఎం నితీశ్ కుమార్ తో విబేధాల కారణంగా సింగిల్ గానే ఎన్నికల్లో పోటీ చేసింది. 130 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. కానీ కేవలం 1 సీటు మాత్రమే సాధించింది. ఆ సమయంలో పార్టీ పనైపోయిందని చాలా మంది ఎద్దేవా చేశారు. కానీ ఐదేళ్లు తిరగకుండానే ఎల్జేపీ పార్టీ తన సత్తా ప్రదర్శించింది. తండ్రి రామ్ విలాస్ పాసవాన్ వారసత్వాన్ని కొనసాగిస్తూ చిరాగ్ పాసవాన్.. వరుస ఎన్నికల్లో దుమ్ములేపుతున్నారు. తాజాగా బిహార్లో ఎన్నికల్లోనూ చిరాగ్ పార్టీ విజయదుంధుభి మోగించిన నేపథ్యంలో ఈ విజయాన్ని జనసేన పార్టీ గెలుపుతో పోలుస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications