అనుకూలం 128, వ్యతిరేకం 112, పౌరసత్వ సవరణ బిల్లుపై అధికార, విపక్షాల బలబలాల అంచనాలివే..
పౌరసత్వసవరణ బిల్లు బుధవారం లోక్సభ ముందుకు రానుంది. దిగువసభ లోక్సభలో బిల్లు 311-80 తేడాతో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఎగువసభలో ఆమోదంతో చట్టరూపం దాల్చనుంది. అయితే రాజ్యసభలో అధికార బీజేపీకి పూర్తి మెజార్టీ లేకపోవడం.. శివసేన, జేడీయూ దూరంగా ఉండటంతో బిల్లు గట్టెక్కుతుందా అనుమానాలు తలెత్తుతున్నాయి.

పౌరసత్వం ఇవ్వం
2014 డిసెంబర్ 31 వరకు పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిమేతరులకు భారతీయ పౌరసత్వం ఇస్తామని చట్టం రూపొందించారు. దీనిపై విపక్షాల నుంచి అభ్యంతరం వ్యక్తమైన సంగతి తెలిసిందే. రాజ్యసభలో బీజేపీకి తగిన సంఖ్యాబలం లేకపోవడంతో బిల్లు గట్టెక్కడంపై ఉత్కంఠ నెలకొంది.

దూరంగా శివసేన
రాజ్యసభలో శివసేన పార్టీకి ముగ్గురు ఎంపీలు ఉన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీతో నెలకొన్న వివాదంతో.. కేంద్ర మంత్రివర్గం నుంచి కూడా శివసేన బయటకొచ్చింది. బీజేపీతో అంటిముట్టనట్టుగానే ఉంటోంది. లోక్సభలో జరిగిన ఓటింగ్కు శివసేన 12 మంది ఎంపీలు దూరంగా ఉన్నారు. రాజ్యసభలో జరిగి ఓటింగ్కు కూడా దూరంగా ఉంటారని తెలుస్తోంది. మరోవైపు జేడీయూ కూడా అంటిముట్టగానే వ్యవహరిస్తోంది. ఎన్డీఏలో కొసాగుతున్న కేంద్ర మంత్రివర్గ విస్తరణలో సరైన ప్రాధాన్యం లేదని కినుక వహించిన సంగతి తెలిసిందే.

జేడీయూ కూడా
దీంతో ఆ పార్టీ ఎంపీలు అధినేత నితిశ్ కుమార్ నిర్ణయంపై ఆధారపడి ఉన్నారు. రాజ్యసభలో జేడీయూకు ఆరుగురు ఎంపీలు ఉన్నారు. ఎన్ఆర్సీ సవరణ బిల్లుకు మద్దతిచ్చేందుకు నితీశ్ కుమార్ సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. కానీ బిల్లు గట్టెక్కుతుందని ప్రభుత్వ వర్గాలు ధీమాతో ఉన్నాయి.

ఇదీ లెక్క
రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 240 కాగా.. బీజేపీకి 83 మంది ఉన్నారు. జేడీయూ, ఎస్ఏడీ, ఏఐఏడీఎంకే, బీజేడీ, వైసీపీతో గట్టెక్కచ్చని భావిస్తోంది. బీజేపీ 83, జేడీయూ, ఎస్ఏడీ మూడు చొప్పున అన్నాడీఎంకే 11, బీజేడీ 7, వైసీపీ ఇద్దరు సభ్యులతో తమ సంఖ్య 128కి చేరుతుందని భావిస్తోంది. దీంతో సులభంగా గట్టెక్కుతామని చెబుతుంది. శివసేనకు లెక్కగట్టకున్నా.. జేడీయూ ఎలా వ్యవహరిస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది.

బలంగా విపక్షం
ఇక విపక్ష కూటమికి 112 ఓట్లతో బలంగా కనిపిస్తోంది. కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఎస్పీ, వామపక్షాలు, టీఆర్ఎస్ కూడా వీరికి జతకానుంది. లోక్సభ ఓటింగ్లో టీఆర్ఎస్ వ్యతిరేకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications