ఇండిగో సిబ్బంది దాడిపై మంత్రి ఆశోక్ సీరియస్, నివేదిక ఇవ్వాలని ఆదేశం
ప్రయాణికుడిపై ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బంది చేయిచేసుకున్న ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు బుధవారం స్పందించారు.
న్యూఢిల్లీ: ప్రయాణికుడిపై ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బంది చేయిచేసుకున్న ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు బుధవారం స్పందించారు. ప్రయాణికుడు సంజయ్ కత్వాల్పై దాడిని కేంద్రమంత్రి ఆశోక్గజపతిరాజు ఖండించారు. ఈ ఉదంతంపై స్వతంత్ర నివేదిక సమర్పించాల్సిందిగా డైరెక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్ను ఆదేశించారు. కేంద్ర మంత్రి ఆశోక్గజపతిరాజు.
ఇండిగో సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అశోక్ గజపతి రాజు చెప్పారు. ఇలాంటి అనాగరిక విషయాలు జరగకూడదని మంత్రి హెచ్చరించారు. విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

మరోవైపు ఇండిగో సిబ్బంది దురుసు ప్రవర్తన వ్యవహారం వీడియోసాక్షిగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇండిగో ఎయిర్ లైన్స్ యాజమాన్యం క్షమాపణలు చెప్పింది. ప్రయాణికుడిని స్వయంగా కలిసి ఎయిర్లైన్స డైరెక్టర్ దాడి ఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తూ. క్షమాపణలు చెప్పారు.ఈ సంఘటన అక్టోబర్ 15 ఢిల్లీ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. అయితే తాజాగా దీనికి సంబంధించిన వీడియో నెట్లో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications