ఇండిగో సిబ్బంది దాడిపై మంత్రి ఆశోక్ సీరియస్, నివేదిక ఇవ్వాలని ఆదేశం
ప్రయాణికుడిపై ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బంది చేయిచేసుకున్న ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు బుధవారం స్పందించారు.
న్యూఢిల్లీ: ప్రయాణికుడిపై ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బంది చేయిచేసుకున్న ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు బుధవారం స్పందించారు. ప్రయాణికుడు సంజయ్ కత్వాల్పై దాడిని కేంద్రమంత్రి ఆశోక్గజపతిరాజు ఖండించారు. ఈ ఉదంతంపై స్వతంత్ర నివేదిక సమర్పించాల్సిందిగా డైరెక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్ను ఆదేశించారు. కేంద్ర మంత్రి ఆశోక్గజపతిరాజు.
ఇండిగో సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అశోక్ గజపతి రాజు చెప్పారు. ఇలాంటి అనాగరిక విషయాలు జరగకూడదని మంత్రి హెచ్చరించారు. విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

మరోవైపు ఇండిగో సిబ్బంది దురుసు ప్రవర్తన వ్యవహారం వీడియోసాక్షిగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇండిగో ఎయిర్ లైన్స్ యాజమాన్యం క్షమాపణలు చెప్పింది. ప్రయాణికుడిని స్వయంగా కలిసి ఎయిర్లైన్స డైరెక్టర్ దాడి ఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తూ. క్షమాపణలు చెప్పారు.ఈ సంఘటన అక్టోబర్ 15 ఢిల్లీ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. అయితే తాజాగా దీనికి సంబంధించిన వీడియో నెట్లో కలకలం రేపింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications