Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బెంగాల్లోజడ్జీలనే బంధిస్తారా ? సీబీఐ/ఎన్ఏఐ దర్యాప్తుకు సుప్రీం ఆదేశాలు..!

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి భారీ షాక్ తగిలింది. రాష్ట్రంలో ఈసీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణను సవాల్ చేస్తూ గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆమెకు ఊరట దక్కలేదు. అదే సమయంలో రాష్ట్రంలో ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ పర్యవేక్షణ కోసం సుప్రీంకోర్టు న్యాయాధికారుల్ని నియమించింది. ఇప్పుడు తాజాగా మాల్దాలో ఏడుగురు న్యాయాధికారుల్ని మమత సర్కార్ బంధించడంతో సుప్రీం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

మాల్దాలో ఏడుగురు న్యాయాధికారులను గంటల తరబడి బందీలుగా పట్టుకున్న దిగ్భ్రాంతికరమైన ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఇది తమ అధికారానికి సవాలు విసురుతోందని, పథకం ప్రకారం, ఉద్దేశపూర్వకంగా జరిగినట్లు కనిపిస్తోందని ప్రధాన న్యాయమూర్తి (CJI) సూర్యకాంత్ ఆక్షేపించారు. ఈ ఘటనపై సీబీఐ లేదా ఎన్ఏఐతో దర్యాప్తు జరిపించాలని భారత ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ దర్యాప్తును తామే పర్యవేక్షిస్తామని కూడా తెలిపింది.

CJI Orders CBI NIA Probe into Shocking Malda Hostage Crisis Judicial Officers Held for 9 Hours

ఓటర్ల జాబితాల సవరణ సమయంలో ఇందులో నుంచి తమ పేర్లను తొలగించిన ఓటర్ల బృందం.. మాల్దాలో ముగ్గురు మహిళలతో సహా మొత్తం ఏడుగురు న్యాయాధికారులను తొమ్మిది గంటలకు పైగా బందీలుగా పట్టుకుంది. నిన్న మధ్యాహ్నం నుంచి తెల్లవారుజామున సుమారు 1 గంట వరకూ బందీలుగా ఉన్న వీరు.. భారీ సంఖ్యలో పోలీసులు, పారామిలిటరీ సిబ్బంది సాయంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న సమయంలోనూ వాహనాలపై దాడి చేసేందుకు కూడా ప్రయత్నం జరిగింది. పోలీసులు న్యాయాధికారులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుండగా, పగిలిపోయిన కారు కిటికీ అద్దాలు, ఆగ్రహంతో ఉన్న నిరసనకారులు కార్లపై రాళ్లు విసురుతున్న దృశ్యాలు కనిపించాయి.

CJI Orders CBI NIA Probe into Shocking Malda Hostage Crisis Judicial Officers Held for 9 Hours

సాయంత్రం 5 గంటలకు అధికారులను ముట్టడించారని, రాత్రి 11 గంటల వరకు వారికి సాయం అందలేదని సీజేఐ తెలిపారు. నిన్నటి ఘటనను రాజకీయ నాయకులందరూ ఏకగ్రీవంగా ఖండించాలని మరో న్యాయమూర్తి జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి కోరారు. తాము ప్రత్యేక అధికారులను రక్షించడానికే ఇక్కడ ఉన్నామని, వారి ఆదేశాలు తమ కోర్టు ఆదేశాలుగా పరిగణించబడతాయని తెలిపారు. ఈసీ ఎక్కడి నుంచైనా బలగాలను రప్పించి, న్యాయాధికారులను కాపాడాలన్నారు. ఈ ఘటన న్యాయాధికారులను బెదిరించడానికే కాక, ఈ కోర్టు అధికారాన్ని కూడా సవాలు చేసే ఒక బరితెగించిన ప్రయత్నం అన్నారు. న్యాయాధికారులకు అప్పగించిన పని సురక్షితంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+