వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భలే చాన్స్: ఈ ఫ్రిజ్ కి విద్యుత్ అవసరమే లేదు... ధర కూడా రూ.4 వేలే!

కూరగాయల వృథాను అరికట్టేందుకు ఢిల్లీకి చెందిన ఓ బాలిక సరికొత్త ఫ్రిడ్జ్ కు రూపకల్పన చేసింది. విద్యుత్ అవసరం లేకుండా కేవలం రూ.4,000 ఖర్చుతో ఈ ఫ్రిడ్జ్ ను తయారు చేసి దీక్షిత అందరినీ ఆకట్టుకుంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. ప్రధానంగా కూరగాయల ధరలు నింగికెగశాయి. ఈ పరిస్థితుల్లో చిన్న కూరగాయ వృథా అయినా ప్రాణం విలవిల్లాడిపోతోంది. ఈ నేపథ్యంలో కూరగాయల వృథాను అరికట్టేందుకు ఢిల్లీకి చెందిన ఓ బాలిక సరికొత్త ఫ్రిడ్జ్ కు రూపకల్పన చేసింది.

ఈ బాలిక పేరు దీక్షిత. ఈమె ఢిల్లీలోని జేడీ గొయాంక పబ్లిక్‌ స్కూల్‌ లో సీనియర్ ఇంటర్ చదువుతోంది. విద్యుత్ అవసరం లేకుండా కేవలం రూ.4,000 ఖర్చుతో ఈ ఫ్రిడ్జ్ ను తయారు చేసి దీక్షిత అందరినీ ఆకట్టుకుంది.

పర్యావరణ హితమైన విధానంలో పేదలకు ఉపయోగపడే వస్తువు తయారు చేయాలని ఆలోచించిన దీక్షిత సైన్స్ లోని నిష్క్రియాత్మక ఆవిరి విధానం ద్వారా టెంపరేచర్ స్థిరంగా ఉంచవచ్చని తెలుసుకుంది.

దీంతో ఆహారపదార్థాలు వృథా కాకుండా ఉండేందుకు ఫ్రిడ్జ్ రూపొందించింది. ఇటుకలు, ఇసుక, వెదురు బొంగులు, జనపనార సంచులను ఈ ఫ్రిడ్జ్ తయారీలో ఉపయోగించింది. తొలుత భూమిలో ఇటుకలతో దీర్ఘచతురస్రాకార నిర్మాణాన్ని రూపొందించింది.

ఇందులో అలాంటిదే మరో చిన్న ఛాంబర్‌ ను తయారు చేసింది. ఈ ఛాంబర్ కి చిన్న ఛాంబర్ కి మధ్య ఖాళీని అలాగే ఉంచింది. ఈ చిన్న ఛాంబర్ లో మూడు భాగాలు చేసి, ఆ భాగాల మధ్య ఖాళీని ఇసుకతో నింపింది.

ఛాంబర్ కు మూతగా వెదురు కర్రలతో తలుపులాంటిదాన్ని తయారు చేసింది. ఇందులో సుమారు 120 కేజీల కూరగాయల వరకు నిల్వ ఉంచుకోవచ్చని, ఇవి వారం రోజుల వరకు పాడవకుండా ఉంటాయని చెబుతోంది.

ఇందులో ఉష్ణోగ్రత 10-15 డిగ్రీల మధ్య ఉంటుందని ఆమె చెబుతోంది. దీని తయారీకి సుమారు 4,000 రూపాయలు ఖర్చవుతుందని తెలిపింది. దీక్షిత ఈ ఫ్రిడ్జ్ పలువురి ప్రశంసలు అందుకుంటోంది.

English summary
In a bid to save the consumable food, a class 12 student from Delhi designed a prototype of a ‘magic-fridge’ which can run without electricity. The product has been designed keeping in mind the need of farmers and middlemen who deal with fruits and vegetables. "From the beginning, I was always inclined towards environmental issues and wanted to find sustainable solutions." says Dikshita Khullar, a class 12 student from G.D. Goenka Public School, Vasant Kunj, New Delhi, reports SwachhIndia. Inculcating her learning from school, Dikshita used the concepts of passive evaporation to make this magic fridge. Just by using bricks, sand, jute bags and bamboos, she's designed her prototype that can be used by farmers and middlemen.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X