జయలలిత మృతి, జ్యుడీషియల్ విచారణ, వీడియోలు ఇస్తాం, మన్నార్ గుడి ఫ్యామిలీ, పన్నీర్ !
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై తమిళనాడు ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకు ఆదేశిస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని శశికళ నటరాజన్ సోదరుడు దివాకరన్ కుమారుడు జయంత్ అన్నాడు. అమ్మ మరణంలో ఎలాంటి అనుమానాలు వద్దని అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలకు చెప్పాడు.
జయలలిత మృతిపై జ్యుడీషియల్ విచారణకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం ఆదేశిస్తే మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సైతం విచారణ ఎదుర్కోవలసి వస్తుందని జయంత్ అన్నాడు. అందుకు పన్నీర్ సెల్వం సిద్దంగా ఉన్నారా ? అంటూ జయంత్ ప్రశ్నించారు.

జయలలిత మృతిపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశిస్తే సరైన సాక్షాదారాలు ఇవ్వడానికి శశికళ కుటుంబ సభ్యులు సిద్దంగా ఉన్నారని జయంత్ చెప్పాడు. జయలలితకు చికిత్స చేసే సమయంలో వందకు వంద శాతం వీడియోలు తీశామని జయంత్ వివరించాడు.
జ్యుడీషియల్ విచారణ జరిగితే మా దగ్గర ఉన్న వీడియోలు ఇవ్వడానికి తాము సిద్దంగా ఉన్నామని జయంత్ అన్నాడు. మదురై జిల్లాలో జరిగిన టీటీవీ దినకరన్ బహిరంగ సభ విజయవంతం కావడంతో శశికళ కుటుంబ సభ్యులు ఇప్పుడు స్వరం పెంచుతున్నారు. అన్నాడీఎంకే పార్టీకి మేమే నిజమైన వారసులు అంటు ఒక్కొక్కరు ముందుకు వస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications