సీఎం కుర్చీ ఎంత ?, ప్రజలు కావాలి, మోదీ జోక్యం చేసుకోవాలి, సీఎం !
బెంగళూరు/మైసూరు: కావేరి జలాల (cauvery) సంక్షోభంలో జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని (modi) అభ్యర్థిస్తూ మాజీ ప్రధాని, జేడీఎస్ పార్టీ చీఫ్ హెచ్డీ దేవెగౌడ రాసిన లేఖను స్వాగతిస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య (Siddaramaiah)అన్నారు. మాజీ సీఎం దేవెగౌడ అభ్యర్థనను ప్రధాని నరేంద్ర మోదీ (modi) అంగీకరించి వెంటనే చర్చలకు ఆహ్వానించాలని సిద్దరామయ్య (Siddaramaiah) చెప్పారు.
దీంతో పాటు కర్ణాటక రాష్ట్ర బీజేపీ నేతలు ప్రధాని నరేంద్ర మోదీపై (modi)ఒత్తిడి తేవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah)కోరారు. ప్రధాని నరేంద్ర మోదీకి మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ రాసిన లేఖను ట్విట్టర్లో (cauvery) పోస్ట్ చేసిన సిద్ధరామయ్య, ఈ పరిస్థితికి ప్రధాని నరేంద్ర మోదీ (modi) మధ్యవర్తిత్వం వహించి కర్ణాటకకు అన్యాయం జరగకుండా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించడమే సమర్థవంతమైన సరైన పరిష్కారం అని సిద్దరామయ్య (Siddaramaiah) అభిప్రాయం వ్యక్తం చేశారు.

అందువల్ల మాజీ ప్రధాని దేవెగౌడ అభ్యర్థనను ప్రధాని నరేంద్ర మోదీ (modi)అంగీకరించి వెంటనే కర్ణాటక, తమిళనాడును చర్చలకు ఆహ్వానిస్తారని విశ్వసిస్తున్నానని సిద్దరామయ్య (Siddaramaiah) అన్నారు. జేడీఎస్ పార్టీ సీనియర్ నేత హెచ్ డీ దేవెగౌడ తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆ పార్టీ రాష్ట్ర బీజేపీ నేతలు, ఎంపీలు జోక్యం చేసుకునేలా ప్రధానిపై (modi) ఒత్తిడి తేవాలని సిద్దరామయ్య (Siddaramaiah) అంటున్నారు.

వీలైనంత త్వరగా రాష్ట్రంలోని అన్ని పార్టీల నేతలతో కూడిన బృందాన్ని చర్చలకు పిలిపించాలని ప్రధాని నరేంద్ర మోదీని (modi)కోరతానని సిద్దరామయ్య (Siddaramaiah)చెప్పారు.
భూమి, బాష, నీటి ప్రయోజనాలను కాపాడే విషయంలో కర్ణాటక రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు తమ విభేదాలను మరచి కలిసి కావేరి (cauvery) నీటి సమస్య పరిష్కారానికి ప్రయత్నించిన చరిత్ర కర్ణాటక రాష్ట్రానికి ఉందని, జేడీఎస్ మాదిరిగానే బీజేపీ కూడా ఈ వారసత్వాన్ని అనుసరిస్తుందని నమ్ముతున్నానని సిద్దరామయ్య (Siddaramaiah)అన్నారు.
తాము కావేరి నీటి (cauvery) కోసం ఎవ్వరితో రాజీ పడలేదని, మాకు పదవుల కంటే ప్రజలు ముఖ్యం అని, సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించి మేము తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేశామని, బీజేపీ ఆరోపిస్తున్నట్లు తనకు సీఎం కుర్చి ముఖ్యం కాదని సిద్దరామయ్య (Siddaramaiah) అన్నారు. కావేరి నీటి విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ (modi) జోక్యం చేసుకుంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని సిద్దరామయ్య (Siddaramaiah) అంటున్నారు.












Click it and Unblock the Notifications