కోల్ఇండియాలో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు: దరఖాస్తు చేసుకోండి
1319 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల కోసం కోల్ ఇండియా రిక్రూట్మెంట్ 2017 నోటిఫికేషన్ వెలువడింది.
న్యూఢిల్లీ: కోల్ ఇండియా రిక్రూట్మెంట్ 2017(1319 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు)
వివరాలు:
1319 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల కోసం కోల్ ఇండియా రిక్రూట్మెంట్ 2017 నోటిఫికేషన్: కోల్ ఇండియా లిమిటెడ్(సీఐఎల్).. 1319 1319 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఫిబ్రవరి 24, 2017లోపు ఈ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది.
కంపెనీ పేరు: కోల్ ఇండియా లిమిటెడ్(సీఐఎల్)
పోస్టు పేరు: మేనేజ్మెంట్ ట్రైనీ
జాబ్ లొకేషన్: ఆల్ ఇండియా
చివరి తేదీ: ఫిబ్రవరి 24, 2017
కావాల్సిన అర్హతలు: బీఈ, బీటెక్, బీఎస్సీ, ఐసీడబ్ల్యూఏ, సీఏ, గ్రాడ్యూయేట్, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా

మొత్తం పోస్టుల సంఖ్య: 1319 ఖాళీలు
విద్యార్హత/అర్హత ప్రమాణం: మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టు కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు బీఈ/ బీటెక్/ ఏఎంఐఈ/ఇంజినీరింగ్లో బీఎస్సీ/ ఐసీడబ్ల్యూఏ/సీఏ/గ్రాడ్యూయేట్/పోస్ట్ గ్రాడ్యూయేట్ డిగ్రీ/డిప్లొమాలలో 60శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
అభ్యర్థి జీతం వివరాలు: నెలకు రూ.20,600-46,500
వయో పరిమితి(ఏళ్లలో):- మేనేజ్ మెంట్ ట్రైనీ పోస్టు కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18ఏళ్ల కంటే తక్కువగా ఉండకూడదు. 30ఏళ్లకు మించి ఉండకూడదు. డిసెంబర్ 1, 2016 వరకు అభ్యర్థి వయస్సును పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది.
ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులను రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.
దరఖాస్తు చేసుకోవడం ఎలా: ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో అధికారిక వెబ్సైట్ ద్వారా జనవరి 5 నుంచి ఫిబ్రవరి 24, 2017లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం, దరఖాస్తు వివరాలు కోసం సంప్రదించండి: https://goo.gl/QM4sJy












Click it and Unblock the Notifications