మరో షాక్: కోల్ స్కాంలో దాసరి, జిందాల్ సహా 15 మందిపై ఛార్జీషీట్
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన బొగ్గు కుంభకోణం కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) బుధవారం నాడు ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ నవీన్ జిందాల్, మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణ రావు తదితరుల పైన ఛార్జీషీట్ దాఖలు చేసింది.
దాసరి నారాయణ రావు, నవీన్ జిందాల్ సహా 15 మందిపై అభియోగాలు నమోదు చేసింది. అలాగే, ఐదు కంపెనీల పైన కూడా అభియోగాలు నమోదు చేసింది. అందులో జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, జిందాల్ రియాల్టీ ప్రయివేటు లిమిటెడ్ తదితర కంపెనీలు ఉన్నాయి.
మాజీ జార్ఖండ్ ముఖ్యమంత్రి మధుకొడా, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్సీ గుప్తా, తదితరులపై నేరపూరిత కుట్ర, చీటింగ్, అవినీతి నిరోధక చట్టం కింద ఈ ఛార్జీషీటును దాఖలు చేసింది.

కాగా, కొద్ది రోజుల క్రిత ఈడీ దాసరికి చెందిన రూ.2.25 కోట్ల ఆస్తులను జఫ్తు చేసిన విషయం తెలిసిందే. దీనిపై దాసరి అప్పుడు స్పందించారు. సౌభాగ్య మీడియాలో తాను వాటాదారు మాత్రమేనని స్పష్టం చేశారు. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్లో సౌభాగ్య మీడియా లిమిటెడ్ లిస్టెడ్ కంపెనీ అని, ఆ కంపెనీ వాటాల ట్రేడింగ్ జరుగుతోందని తెలిపారు.
ఈడీ ఆస్తుల జప్తునకు సంబంధించి తనకు ఎలాంటి ఉత్తర్వులూ అందలేదని, తన సొంత ఆస్తులను జప్తు చేస్తూ ఈడీ ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేదని దాసరి స్పష్టం చేశారు. ఈడీ జప్తు ఉత్తర్వులు ఇచ్చినట్లయితే అవి తాను వాటాదారుగా ఉన్న సౌభాగ్య మీడియాకు చెందిన ఆస్తులవేనని మీడియాకు తెలిపారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications