వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోల్‌గేట్: ఎఫ్ఐఆర్‌లో కుమారమంగళం బిర్లా, హిందాల్కో

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kumar Mangalam Birla
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొగ్గు కుంభకోణం కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) మంగళవారం మరో చార్జిషీట్ దాఖలు చేసింది. బొగ్గు శాఖ కార్యదర్శి పిసి పరేఖ్, బిర్లా గ్రూప్‌కు చెందిన కుమార్ మంగళం బిర్లా పేర్లను చార్జిషీట్‌లో సిబిఐ నిందితులుగా చేర్చింది.

ఈ కేసుకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్‌లోని హైదరాబాద్, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కత్తా, మహారాష్ట్రలోని ముంబైలో సిబిఐ తనిఖీలు చేస్తోంది. తద్వారా బొగ్గు కుంభకోణం కేసులో సిబిఐ సోదాలు మళ్లీ ముమ్మరం చేసింది. భువనేశ్వర్‍‌లో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది.

బొగ్గు కుంభకోణం కేసు ఛార్జీషీటులో తాజాగా 14వ ఎఫ్ఐఆర్‌ను సిబిఐ దాఖలు చేసింది. ఛార్జీషీటులో కుమార మంగళం బిర్లా, పరేఖ్ పేర్లను కొత్తగా చేర్చింది. వీరితో పాటు నాల్కో, హిందాల్కోలను ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది.

తాజా ఎఫ్ఐఆర్‌లో పేరు ఉండటంతో కుమార మంగళం బిర్లా చిక్కుల్లో పడ్డారు. కాగా, 1993 నుండి 2011 వరకు కేటాయించిన 192 బొగ్గు గనుల కేటాయింపుపై సిబిఐ విచారణ జరుపుతోంది.

English summary
The CBI on Tuesday lodged fresh FIR in the Coalgate scam. The premiere agency has named Aditya Birla Group Chairman Kumar Mangalam Birla, NALCO and HINDALCO in its new FIR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X