Hello I am స్వప్న, ఫ్రం క్రైమ్ బ్రాంచ్: అర్దకేజీ నగలు నొక్కేసిన కిలాడీ లేడీ పోలీసు, కోర్టుకు నామాలు
చెన్నై/ కోయంబత్తూరు (కోవై): Hello I am స్వప్న ఫ్రం క్రైమ్ బ్రాంచ్ అంటూ ఇంతకాలం చెలరేగిపోయింది. లేడీ పోలీసుగా పని చేస్తున్న మహిళ ఆమె చేతివాటం చూపించింది. అసలే క్రైమ్ బ్రాంచ్ లో ఉద్యోగం చేస్తుండటంతో ఆమె ఆడిందే ఆట పాడిందే పాటగా తయారైయ్యింది. అయితే ఎవరు తవ్విన గోతిలో వారే పడతారని ఆ లేడీ పోలీసు గుర్తించలేకపోయింది. పై అధికారులతో పాటు కోర్టుకు నామం పెట్టి మోసం చేసిన క్రైమ్ బ్రాంచ్ లేడీ పోలీసు సుమారు అర్దకేజీ బంగారు నగలు నొక్కేసింది. చివరికి లేడీ పోలీసు పాపం పండిపోవడంతో తప్పించుకుని తిరుగుతున్న ఆమె కోసం గాలించి చివరికి పట్టుకుని అరెస్టు చేసి జైలు పంపించారు.

క్రైమ్ బ్రాంచ్ లేడీ పోలీసు
తమిళనాడులోని కోయంబత్తూరు (కోవై)లోని ఒండిపుదూరుకు చెంది స్వప్న సుజ (40) సింగానల్లూరు క్రైమ్ బ్రాంచ్ లో లేడీ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నది. క్రైమ్ బ్రాంచ్ లో ఉద్యోగం కావడంతో స్వప్న సుజ అనేక కేసుల విచారణకు పై అధికారులతో కలిసి వెళ్లింది. ఆ సమయంలో దొంగలపై స్వప్న సుజ డేగకన్ను వేసింది.

కోర్టులో బంగారు నగలు
అనేక కేసుల్లో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దొంగలను అరెస్టు చేసి వారి నుంచి లక్షల రూపాయల విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. దొంగలను అరెస్టు చేసిన పోలీసు అధికారులు వారిని కోర్టు ముందు హాజరుపరిచే సమయంలో వారి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు నగలు, నగదు, విలువైన వస్తువులు కోర్టులో సమర్పించాలి. పోలీసు శాఖలో ఇది ఎప్పటి నుంచి ఉంటున్న రూల్.

అర్దకేజీ నగలు స్వాహా
దొంగల నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు నగల్లో లేడీ కానిస్టేబుల్ స్వప్న సుజ సుమారు 60 సవర్లు (480 గ్రాములు) నగలు నొక్కేసింది. దొంగల నుంచి నొక్కేసిన నగలు ఇంట్లో దాచిపెట్టుకున్న స్వప్న సుజ మిగిలిన నగలు కోర్టులో సమర్పించింది. అయితే దొంగలు చెప్పిన సమాచారంకు, కోర్టులో సమర్పించిన బంగారు నగలకు దాదాపు అర్దకేజీకి పైగా తేడా రావడంతో క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులకు అనుమానం వచ్చింది.

11 రికవరీ కేసుల్లో చేతివాటం
11 చోరీ కేసులు విచారణలో దొంగల ఇచ్చిన సమాచారం, వారి దగ్గర స్వాధీనం చేసుకున్న నగలు, కోర్టులో సమర్పించిన నగల్లో సుమారు అర్దకేజీకి పైగ తేడా ఉందని క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు గుర్తించారు. కేసుల విచారణలో పాల్గొన్న ప్రతిఒక్క పోలీసుతో పాటు లేడీ కానిస్టేబుల్ స్వప్న సుజను కూడా విచారణ చేశారు. అయితే లేడీ పోలీసు స్వప్న సుజ పొంతనలేని సమాధానం చెప్పింది.
Recommended Video

క్రైమ్ బ్రాంచ్ కిలాడీ లేడి
స్వప్న సుజ మీద అనుమానం ఎక్కువ కావడంతో గత ఫిబ్రవరి నెలలో ఆమె సెలవుపై వెళ్లిపోయింది. తరువాత కోయంబత్తూరు జిల్లా ఎస్పీ సుమిత్ చరణ్ కిలాడి పోలీసు స్వప్న సుజను సస్పెండ్ చేశారు. స్వప్న సుజ కేసు ఇన్స్ పెక్టర్ శివకుమార్ అప్పగించి విచారణ చెయ్యమని ఆదేశాలు జారీ చేశారు. తన మీద విచారణ కొనసాగుతుందని తెలిసిన స్వప్న మాయం అయ్యింది. అప్పటి నుంచి స్వప్న కోసం గాలించిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చివరికి ఆమెను అరెస్టు చేశారు. స్వప్న సుజ నొక్కేసిన అర్దకేజీ బంగారు నగలు ఏం అయ్యాయి ? అవి ఎక్కడ ఉన్నాయి ? అంటూ పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారని జిల్లా ఎస్పీ సుమిత్ చరణ్ మీడియాకు చెప్పారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications