వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుదిరిన రాజీ?: సీఎం పళనిస్వామే, ప్రధాన కార్యదర్శిగా పన్నీరు, దినకరన్ అరెస్ట్‌ వరకు ఆగి.. అప్పుడు..

తమిళనాట పన్నీరు, పళనిల మధ్య రాజీ కుదిరినట్లు తెలుస్తోంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నా డీఎంకేలో రెండు వర్గాల మధ్య విలీన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయా? తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి, మాజీ సీఎం పన్నీరు సెల్వం వర్గాల మధ్య రాజీ కుదిరిందా? ఈ రెండు గ్రూపులు త్వరలో విలీనం కానున్నాయా?

ఈ ప్రశ్నలకు ఇప్పుడు అవుననే సమాధానం ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో విచారణ ఎదుర్కొంటున్న శశికళ మేనల్లుడు దినకరన్ అరెస్ట్‌ అయ్యే వరకు ఆగాలని, ఆ తరువాతే సర్దుబాట్లు చేసుకోవాలని ఇరు వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం.

పళని స్వామి ముఖ్యమంత్రి పదవిలోనే కొనసాగేలా, పన్నీరు సెల్వానికి పార్టీ పగ్గాలు అప్పగించేలా ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదిరినట్టుగా ప్రచారం జరుగుతోంది. కాగా దినకరన్‌ను అరెస్ట్ చేసిన తర్వాత ఇరు వర్గాల మధ్య అధికారికంగా చర్చలు జరగవచ్చని తెలుస్తోంది.

Compromise?: AIADMK factions inch close to a merger

పార్టీ గుర్తు 'రెండాకులు' కోసం ఈసీకి పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వజూపిన కేసులో ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ పోలీసులు మూడు రోజులుగా దినకరన్‌ను ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన్ని ఎప్పుడైనా అరెస్ట్‌ చేసే అవకాశముందనే ప్రచారం కూడా జరుగుతోంది.

పార్టీ నుంచి శశికళ, దినకరన్‌లను బహిష్కరించడంతో పాటు జయలలిత మృతిపై విచారణకు అంగీకరిస్తేనే విలీన చర్చలు జరుపుతామని సోమవారం వరకు పన్నీరు సెల్వం వర్గీయులు చెప్పారు. అలాగే పన్నీరుకు ముఖ్యమంత్రి పదవి అప్పగించాలని వారు డిమాండ్‌ చేశారు.

అయితే ఇప్పుడు పరిస్థితి కొంత మారినట్లు కనిపిస్తోంది. తాజాగా పన్నీరుకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తారని, సీఎంగా పళనిస్వామి కొనసాగుతారని, దినకరన్‌ అరెస్ట్‌ అయిన తర్వాత రెండు వర్గాలు విలీనమవుతాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

English summary
Chennai: After weeks of chaos and instability, the two factions of Tamil Nadu’s ruling All India Anna Dravida Munnetra Kazhagam (AIADMK) are close to a merger. While formal discussions are yet to begin, two senior leaders of the AIADMK said chief minister Edappadi K. Palaniswami may step down to make way for former chief minister O. Panneerselvam. An AIADMK legislator from the Panneerselvam faction said on the condition of anonymity, “We have said that he (Panneerselvam) should take over as chief minister, as per the wishes of the people and cadre. And, that is how things have shaped up in the last few days. We can expect a positive decision.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X