Bengaluru: ఆర్ టీసీ బస్సులోనే సజీవదహనం అయిన కండెక్టర్, ఐటీ హబ్ లో ఏం జరిగిందంటే ?
రాత్రి ఆర్ టీసీ బస్సు నిలిపిన డ్రైవర్, కండెక్టర్ భోజనం చేశారు. ఆర్ టీసీ బస్సులోనే నిద్రపోయిన కండెక్టర్ అదే బస్సులోనే సజీవదహనం కావడం కలకలం రేపింది.
బెంగళూరు/బళ్లారి: ఆర్ టీసీలో కండెక్టర్ ఉద్యోగం రావడవతో సంతోషించాడు.ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి వివాహం చేసుకున్ని భార్య, పిల్లలతో సంతోషంగా జీవిస్తున్నాడు. ప్రతినిత్యం అధికారులు కేటాయించిన రూట్ లో కండెక్టర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. రాత్రి డ్యూటీ ముగించుకుని ఉదయం మళ్లీ అదే రూట్ లో డ్యూటీ చెయ్యవలసి ఉంది. రాత్రి ఆర్ టీసీ బస్సు నిలిపిన డ్రైవర్, కండెక్టర్ భోజనం చేశారు. ఆర్ టీసీ బస్సులోనే నిద్రపోయిన కండెక్టర్ అదే బస్సులోనే సజీవదహనం కావడం కలకలం రేపింది.

బీఎంటీసీలో కండెక్టర్ ఉద్యోగం
కర్ణాటకలోని బళ్లారికి చెందిన ముత్తయ్య స్వామి (45) అనే వ్యక్తికి బెంగళూరులోని బీఎంటీసీలో కండెక్టర్ గా ఉద్యోగం వచ్చింది. బెంగళూరు చేరుకున్న ముత్తయ్య స్వామి సుమ్మనహళ్లి డిపో-31లో కండెక్టర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ముత్తయ్య స్వామి ప్రతిరోజు డి గ్రూప్ లేఔట్ రూట్ లో విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం డ్రైవర్ ప్రకాష్ తో పాటు ముత్తయ్య స్వామి విధులకు హాజరైనాడు.

ఆర్ టీసీ బస్సులో నిద్రపోయిన కండెక్టర్
రాత్రి 11 గంటల సమయంలో డి గ్రూప్ లేఔట్ లోని బీఎంటీసీ బస్ స్టాప్ లో కేఏ 57 ఎఫ్-2069 బస్సు పార్క్ చేసిన డ్రైవర్ ప్రకాష్, కండెక్టర్ ముత్తయ్య స్వామి బస్సులో భోజనం చేశారు. రాత్రి 12 గంటల సమయంలో డ్రైవర్ ప్రకాష్ బీఎంటీసీ బస్ షెల్టర్ లోకి వెళ్లి నిద్రపోయాడు. కండెక్టర్ ముత్తయ్య స్వామి బీఎంటీసీ బస్సులోనే నిద్రపోయాడు.

అర్దరాత్రి బస్సులో మంటలు
అర్దరాత్రి దాటిన తరువాత బీఎంటీసీ బస్సుకు మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అదే బస్సులో నిద్రపోతున్న కండెక్టర్ ముత్తయ్య స్వామికి మంటలు వ్యాపించి అదే బస్సులో సజీవదహనం అయ్యాడు. గస్తీ తిరుగుతున్న సుమ్మనహళ్లి పోలీసులు విషయం గుర్తించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

బస్సులోనే బూడిద అయిన కండెక్టర్
మంటలు అదుపు చేసే సమయానికి కండెక్టర్ ముత్తయ్య స్వామి అదే బస్సులో కాలి బూడిద అయ్యాడు. బీఎంటీసీ బస్సులో ఎలా మంటలు వ్యాపించాయి ? అనే విషయంలో పక్కా సమాచారం లేదని, కేసు విచారణలో ఉందని సుమ్మనహళ్లి పోలీసులు అంటున్నారు. బీఎంటీసీ బస్సులో కండెక్టర్ సజీవదహనం కావడం బెంగళూరులో కలకలం రేపింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications