మా పార్టీ ఎమ్మెల్యేల కోసం ఎన్ని రూ కోట్లు గాలం వేశారంటే ?, సాంబ రాసుకో ఇది గ్యారెంటి !
బెంగళూరు: కర్ణాటక డీసీఎం డీకే రెండున్నరేళ్ల తర్వాత శివకుమార్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని, అందులో ఎలాంటి గందరగోళం లేదని మండ్య కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్ బాంబు పేల్చారు. మండ్యలో శుక్రవారం విలేకరులతో మాట్లాడిన ఎమ్మెల్యే రవికుమార్ కాంగ్రెస్ పార్టీ కోసం డీకే శివకుమార్ శక్తి వంచనల లేకుండా పనిచేశాని అన్నారు.
కేపీసీసీ అధ్యక్షుడిగా పార్టీని నిర్వహించి అధికారంలోకి తీసుకురావడంలో డీకే శివకుమార్ విజయం సాధించారని, అయితే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తనకు తెలియదని అన్నారు. సీఎం సిద్ధరామయ్య మంచి పని చేస్తున్నారు. బీజేపీ తప్పుడు ప్రకటనలు ఇస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు సంక్షేమ పథకాలు అందించి ప్రజలకు అందజేస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే రవివకుమార్ చెప్పారు.

రానున్న లోక్సభ ఎన్నికల్లో మండ్య లోక్సభ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని, మండ్య ప్రస్తుత ఎంపీ సుమలత కాంగ్రెస్లో లేరని, ఆమె బీజేపీలో చేరారని రవికుమార్ అన్నారు. మండ్య లోక్ సభ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టి గెలిపిస్తామని మండ్య ఎమ్మెల్యే రవికుమార్ ధీమా వ్యక్తం చేశారు.
ఆపరేషన్ కమల నాలుగు దిక్కులా సాగుతోంది. ఇప్పటికే 50 మంది ఎమ్మెల్యేలను బీజేపీ సంప్రదించిందని రవికుమార్ మరో బాంబు పేల్చారు. మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప సన్నిహితుడు సంతోష్ ఆపరేషన్ కమల పనిని సీక్రేట్ గా చేస్తున్నాడని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకోవడానికి రూ 50 కోట్లు ఎర చూపుతోందని మండ్య ఎమ్మెల్యే రవికుమార్ ఆరోపించారు.

మైసూర్, బెళగావిలోని గోల్డ్ ఫించ్ హోటల్లో సంతోష్ మా పార్టీకి చెందిన ఎమ్మెల్యే స్నేహితులలో ఒకరిని కలిశారని రవికుమార్ ఆరోపించారు. కాంగ్రెస్, జేడీఎస్ లోని ఎమ్మెల్యేలకు గతంలో గాలం వేసిన వ్యక్తి పేరు, ఆ టీమ్ పేరు ప్రస్తావించకుండా మళ్లీ యాక్టివ్గా ఉందని ఎమ్మెల్యే రవికుమార్ ఆరోపించారు.
బీజేపీ వాళ్లకు వేరే పని లేదు, ఉదయం లేవగానే ఆపరేషన్ కమల కోసం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను వెతుక్కోవడం మొదలుపెట్టారని, మా ఎమ్మెల్యేలతో మాట్లాడిన ఆడియో, వీడియో మా దగ్గర ఉందని, సమయం వచ్చినప్పుడు దానిని ప్రజల ముందు విడుదల చేస్తామని రవికుమార్ బాంబు పేల్చారు. అయితే బీజేపీ నాయకులు ఈ విషయంలో ఎలా స్పందిస్తారో వేచి చూడాలి అంటున్నారు బీజేపీ కార్యకర్తలు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications