వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళా ఎమ్మెల్యేకు బూతు మేసేజ్ లు, అసెంబ్లీలో ప్రస్తావిస్తానని ప్రకటన

మహిళ ఎమ్మెల్యేకు బూతు మేసేజ్ లు వచ్చాయి. ఈ మేసేజ్ లపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ విషయాన్ని తాను అసెంబ్లీ ప్రస్తావించనున్నట్టు వర్ష గైక్వాడ్ ప్రకటించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై:మహిళలకు వేధింపులు తప్పడం లేదు. వారు ఏ స్థాయిలో ఉన్నా కాని, వారిని వేధింపులకు గురౌతున్నారు. మహరాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మహిళ ఎంఏల్ఏకు బూతు మేసేజ్ లు వస్తున్నాయి. ఈ విషయమై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.

మహరాష్ట్రలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంఏల్ఏ వర్ష గైక్వాడ్ కు తరచూ అసభ్య మేసేజ్ లు వస్తున్నాయి. పురుషాధిక్యం గల రాజకీయాల్లో వస్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకోవడం ట్రెండ్ గా మారిందని ఆమె ఆరోపించారు.

ఎంఏల్ఏలుగా ఉన్న తమ లాంటి వారి పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఈ విషయాన్ని తాను ప్రస్తావిస్తానని ఆమె చెప్పారు.

Congress MLA Varsha Gaikwad gets lewd messages

ధరవి అసెంబ్లీ సెగ్మెంట్ నుండి ఆమె ఎమ్మెల్యే గా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.తనతో పాటు తన మాదిరిగానే మరో ఇద్దరు మహిళ నేతలు కూడ ఇలాంటి సమస్యలే ఎదుర్కొంటున్నారని ఆమె ఆరోపించారు.

శివసేన నాయకురాలు నీలమ్ గోర్ఖెను అత్యాచారం చేస్తామని బెదిరింపులు వచ్చాయి. బిజెపి నాయకురాలు షైనా కు కూడ బూతు మేసేజ్ లు కూడ వచ్చిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Congress MLA Varsha Gaikwad on Tuesday registered a case against unknown persons after receiving lewd messages on her phone . "With so many political women receiving these lewd messages, I am noticing a rise in such cases. It has become a trend to target women who have entered the male dominated arena.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X