వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తొలి వికెట్ కాంగ్రెస్‌దే: రషీద్‌ మసూద్‌పై అనర్హత వేటు

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన తర్వాత తొలి వికెట్ పడింది. అది కాంగ్రెసు పార్టీదే కావడం విశేషం, వైద్య కళాశాల సీట్ల కుంభకోణంలో దోషిగా తేలిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రషీద్ మసూద్‌పై సోమవారం అనర్హత వేటు వేశారు. నేరచరితులపై సుప్రీం ఆదేశాల ప్రకారం పదవి కోల్పోయిన మొదటి నేత రషీద్‌.

Congress MP Rashid Masood disqualified from Rajya Sabha

మసూద్‌ను అనర్హునిగా ప్రకటిస్తూ రాజ్యసభ సెక్రటరీ జనరల్ షంషేర్ కె.షరీఫ్ అధికారికంగా ప్రకటించినట్టు రాజ్యసభ వర్గాలు తెలిపాయి. రాజ్యసభలో ఓ స్థానం ఖాళీ అయినట్టు కేంద్ర ఎన్నికల సంఘానికి నోటిఫికేషన్ ప్రతిని పంపినట్టు సమాచారం.

రషీద్‌ 1990-91 మధ్య వీపీ సింగ్ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో త్రిపుర మెడికల్ కాలేజీలకు సీట్ల కేటాయింపుల్లో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై సుదీర్ఘకాలం విచారణ సాగిన అనంతరం మసూద్‌ను కోర్టు దోషీగా ప్రకటించింది.

దాణా కేసులో దోషిగా తేలిన లాలూ ప్రసాద్‌పై, జగదీష్ శర్మపై కూడా లాంఛనంగా అనర్హత వేటు పడే అవకాశాలున్నాయి. లోకసభ సచివాలయం నుంచి ఆ మేరకు నిర్ణయం వెలువడుతుందని అంటున్నారు.

English summary
Convicted Congress leader Rashid Masood on Monday became the first MP to lose his seat after the Supreme Court struck down a provision that protects a convicted lawmaker from disqualification on the ground of pendency of appeal in higher courts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X