కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అనూహ్య నిర్ణయం: పార్టీ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ భేటీపై
న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు- అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో భూకంపాన్నిపుట్టించాయి. అయిదింట్లో ఏ ఒక్క చోట కూడా నామమాత్రంగా కూడా పోటీ ఇవ్వలేకపోయింది. అధికారంలో ఉన్న పంజాబ్ను సైతం కోల్పోవడం.. కాంగ్రెస్ పార్టీ పతనానికి పరాకాష్ఠ. గోవా, ఉత్తరాఖండ్లల్లో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఎగ్జిట్ పోల్స్ సర్వే చేసినా వాస్తవ ఫలితాలు దానికి భిన్నంగా వెలువడ్డాయి.
ఒక వెలుగు వెలిగిన ఉత్తర ప్రదేశ్లో హస్తం పార్టీకి దక్కినవి రెండంటే రెండు స్థానాలే. పార్టీ తురుఫుముక్కగా భావించిన ప్రియాంకాగాంధీ వాద్రా ఉత్తర ప్రదేశ్ ఎన్నికల బాధ్యతలను తీసుకున్నప్పటికీ- అది ఏ మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. సీట్ల సంఖ్యను మరింత తగ్గించింది. ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీ ఛరిష్మా మసక బారిందనడానికి నిలువెత్తు నిదర్శనాలుగా మారాయి. ఎన్నికల్లో ఎదురైన చేదు ఫలితాలను సమీక్షించుకోనుంది అధిష్ఠానం.
ఫలితాలపై చర్చించడానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇవ్వాళ సమావేశం కావాలని తొలుత నిర్ణయించుకుంది. ఈ సాయంత్రం 4 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో సీడబ్ల్యూసీ సమావేశాన్ని షెడ్యూల్ చేసింది. అనూహ్యంగా దీన్ని సోమవారానికి వాయిదా వేసింది. రేపు ఉదయం 10 గంటలకు ఈ సమావేశాన్ని రీషెడ్యూల్ చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా రాజీనామాలు చేస్తారంటూ వార్తలు వెలువడిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సమావేశం వాయిదా పడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

సీడబ్ల్యూసీ సమవేశాన్ని వాయిదా వేయడానికి గల కారణాలను పార్టీ వర్గాలు వివరించాయి. ఈ ఉదయం 10 గంటలకు పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ సమావేశం ఏర్పాటు కానున్నందున సీడబ్ల్యూసీ భేటీని వాయిదా వేసినట్లు పేర్కొన్నాయి. సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనబోయే 2024 వరకు అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించాల్సి ఉందని, సమయం సరిపోదనే ఉద్దేశంతోనే సీడబ్ల్యూసీ సమావేశాన్ని వాయిదా వేసినట్లు వివరణ ఇచ్చాయి.
సోనియా గాంధీ నివాసం నంబర్ 10, జన్పథ్లో పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ సమావేశం కానుంది. ఉదయం 10:30 గంటలకు ఈ భేటీ ఏర్పాటు కావాల్సి ఉండగా దీన్ని కాస్త ముందుకు జరిపింది పార్టీ అధిష్ఠానం. 10 గంటలకే సమావేశమౌతుంది. సాయంత్రం వరకూ కొనసాగుతుంది. కాగా- సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాల రాజీనామాలపై కాంగ్రెస్ స్పందించింది. అది తప్పుడు ప్రచారమని పార్టీ సీనియర్ నాయకుడు రణ్దీప్ సింగ్ సుర్జేవాలా కొట్టిపారేశారు.
-
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications