ఆర్ కే నగర్ లో నేనే గెలుస్తా, రాష్ట్ర రాజకీయాలు తారుమారు: దినకరన్ చాలెంజ్!
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో కచ్చితంగా తానే విజయం సాధిస్తానని, అమ్మకు నిజమైన వారసుడు తానే అని నిరూపించుకుంటానని టీటీవీ దినకరన్ ధీమా వ్యక్తం చేశారు.
గురువారం ఆర్ కే నగర్ పోలింగ్ ముగిసిన తరువాత టీటీవీ దినకరన్ మీడియాతో మాట్లాడారు. ఆర్ కే నగర్ లో దాదాపు 80 శాతం పోలింగ్ నమోదు అయ్యిందని, నూటికి నూరు శాతం తాను విజయం సాధిస్తానని టీటీవీ దినకరన్ చెప్పారు.

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో తాను విజయం సాధించిన తరువాత తమిళనాడు రాజకీయాల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని, తన ఎన్నికల గుర్తు కుక్కర్ దెబ్బ ఏమిటీ చూపిస్తానని పరోక్షంగా ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం ప్రభుత్వాన్ని టీటీవీ దినకరన్ హెచ్చరించారు.
అయితే ఎన్నికల నియమాలు ఉల్లంఘించి జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తీసిన వీడియో విడుదల చేసిన విషయంపై పోలీసులు టీటీవీ దినకరన్, అనర్హత ఎమ్మెల్యే వెట్రివేల్ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications