చల్లని కబురు: తీవ్రమైన ఎండలు, వడగాలుల నుంచి ఉపశమనం, మే తొలివారంలో వర్షాలు

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలంతా ఎండదెబ్బకు, ఉక్కపోతకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, వచ్చే వారం నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, దీంతో వాతావరణం చల్లబడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతన్నారు.

మే నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు

మే నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు

వాయువ్య, ఈశాన్యంలోని కొన్ని ప్రాంతాలతో పాటు ఆగ్నేయ ద్వీపకల్పం మినహా భారతదేశంలోని చాలా ప్రాంతాలలో మేలో సాధారణం నుంచి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. వాతావరణ శాస్త్ర డైరెక్టర్ జనరల్ (ఐఎండీ) డాక్టర్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపిన వివరాల ప్రకారం.. 2022 ఏప్రిల్‌లో వాయువ్య, మధ్య భారతదేశంలోని సగటు గరిష్ట ఉష్ణోగ్రత గత 122 సంవత్సరాలలో వరుసగా 35.90 డిగ్రీల సెల్సియస్, 37.78 డిగ్రీల సెల్సియస్‌తో అత్యధికంగా ఉంది.

ఏప్రిల్ నెలలో భగ్గుమన్న సూరీడు.. రికార్డులు బ్రేక్

ఏప్రిల్ నెలలో భగ్గుమన్న సూరీడు.. రికార్డులు బ్రేక్

"పశ్చిమ-మధ్య, వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాలు, ఈశాన్య భారతదేశంలోని ఉత్తర ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది" అని ఆయన తెలిపారు. ఇంతలో, దేశంలోని విస్తారమైన ప్రాంతాలలో వేడిగాలులు వ్యాపించాయి, ఎండలు అనేక ప్రదేశాలలో 45 డిగ్రీల మార్కును దాటడంతో గురువారం ఎండ తీవ్రత ఎక్కువైంది. గురుగ్రామ్ ఆల్-టైమ్ గరిష్టంగా 45.6 డిగ్రీల సెల్సియస్‌ను నమోదు చేసింది, ఇది ఏప్రిల్ 28, 1979న మునుపటి రికార్డు అయిన 44.8 డిగ్రీల సెల్సియస్‌ను బద్దలు కొట్టింది. ఢిల్లీలో 12 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఏప్రిల్‌లో 43.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఏప్రిల్ 18, 2010న దేశ రాజధానిలో గరిష్టంగా 43.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

దేశంలోని అనేక నగరాల్లో 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు

దేశంలోని అనేక నగరాల్లో 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు

ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో (45.9 డిగ్రీల సెల్సియస్) తీవ్రమైన వేడిగాలులు వీచాయి. మధ్యప్రదేశ్‌లోని ఖజురహో (45.6 డిగ్రీల సెల్సియస్), నౌగాంగ్ (45.6 డిగ్రీల సెల్సియస్), ఖర్గోన్ (45.2 డిగ్రీల సెల్సియస్); మహారాష్ట్రలోని అకోలా (45.4 డిగ్రీల సెల్సియస్), బ్రహ్మపురి (45.2 డిగ్రీల సెల్సియస్), జల్గావ్ (45.6 డిగ్రీల సెల్సియస్), జార్ఖండ్‌లోని డాల్తోన్‌గంజ్ (45.8 డిగ్రీల సెల్సియస్). వాయువ్య, మధ్య భారతదేశం మీదుగా వచ్చే ఐదు రోజుల పాటు, తూర్పు భారతదేశం మీదుగా వచ్చే మూడు రోజుల పాటు వేడిగాలుల స్పెల్ కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.

తీవ్రమైన ఎండలు, వడగాలులతో పెద్దలు, పిల్లలు జాగ్రత్త..

తీవ్రమైన ఎండలు, వడగాలులతో పెద్దలు, పిల్లలు జాగ్రత్త..

శిశువులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు వడగాలులతో జాగ్రత్తగా ఉండాలని, లేదంటే "మితమైన" ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని ఐఎండీ తెలిపింది.
ప్రజలు వేడికి గురికాకుండా ఉండాలని, తేలికపాటి, లేత రంగు కాటన్ దుస్తులను ధరించాలని, తలపై టోపీ లేదా గొడుగుతో కప్పుకోవాలని సూచించింది. గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా, సాధారణం కంటే కనీసం 4.5 నాచ్‌లు ఎక్కువగా ఉన్నప్పుడు హీట్‌వేవ్ ప్రకటించబడుతుంది. ఐఎండీ ప్రకారం, సాధారణ ఉష్ణోగ్రత నుంచి నిష్క్రమణ 6.4 నాచెస్ కంటే ఎక్కువ ఉంటే తీవ్రమైన హీట్‌వేవ్ ప్రకటించబడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+