దేశంలో మరోసారి కరోనా పంజా..వేలల్లో కేసులు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి మరోసారి తన పంజా విసురుతోంది. ముఖ్యంగా గత వారం రోజులుగా నమోదైన కేసుల పెరుగుదల తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. జూన్ 1 (శనివారం) నాటికి దేశంలో 3,395 యాక్టివ్ కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య మే 22న కేవలం 257 ఉండగా, మే 26 నాటికి 1,010కి పెరిగింది. అంటే, కేవలం ఒక్క వారంలోనే కేసుల సంఖ్యలో 1,200 శాతానికి పైగా పెరుగుదల కనిపించడం గమనించదగ్గ విషయం.
ముఖ్యంగా ప్రభావితమవుతున్న రాష్ట్రాలు:
వైద్యాధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కరోనా కేసులు అధికంగా పెరుగుతున్న రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలు అత్యంత ప్రభావితం అవుతున్నాయి.

కేరళ: 189 కొత్త కేసులు, మొత్తం యాక్టివ్ కేసులు - 1,336
మహారాష్ట్ర: 467 యాక్టివ్ కేసులు
ఢిల్లీ: 375 యాక్టివ్ కేసులు
గుజరాత్: 265 యాక్టివ్ కేసులు
కర్ణాటక: 234 యాక్టివ్ కేసులు
పశ్చిమ బెంగాల్: 205 యాక్టివ్ కేసులు
తమిళనాడు: 185 యాక్టివ్ కేసులు
ఉత్తరప్రదేశ్: 117 యాక్టివ్ కేసులు
ఇతర రాష్ట్రాలు: రాజస్థాన్ (60), పుదుచ్చేరి (41), హర్యానా (26), ఆంధ్రప్రదేశ్ (17), మధ్యప్రదేశ్ (16) లలోనూ కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
మరణాలు, కొత్త వేరియంట్లు:
శుక్రవారం నుండి శనివారం మధ్యలో దేశవ్యాప్తంగా 685 కొత్త కేసులు నమోదు కాగా, నాలుగు మరణాలు సంభవించాయి. 2024 సంవత్సరంలో ఇప్పటివరకు 26 మంది కరోనా వల్ల మరణించారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తెలిపిన ప్రకారం, వెస్ట్, సౌత్ ఇండియాలో సేకరించిన నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్లో కొత్త వేరియంట్లు బయటపడ్డాయి. ఇవన్నీ ఒమిక్రాన్ ఉప-వేరియంట్లే అని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎల్ఎఫ్ 7, ఎక్స్ ఎఫ్ జీ, జేఎన్.వన్, ఎన్ బీ.వన్.బి.వన్ అనే వేరియంట్లు ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు గుర్తించారు.












Click it and Unblock the Notifications