corona cases in india .. భారత్ లో కరోనా డేంజర్ బెల్స్, నిన్న ఒక్క రోజే లక్షా 26వేలకు పైగా కేసులు ,685మరణాలు

భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . విపరీతంగా పెరుగుతున్న కేసులతో భారతదేశంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. తాజాగా నమోదైన కేసులు దేశ ప్రజలను వణికిస్తున్నాయి. గత 24 గంటలను దేశవ్యాప్తంగా 1,26,789 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. దీనితో, దేశంలోని మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,29,28,574 కు పెరిగింది.

9 లక్షల మార్కును దాటిన కరోనా యాక్టివ్ కేసులు

9 లక్షల మార్కును దాటిన కరోనా యాక్టివ్ కేసులు

ఏప్రిల్ నెలలో వరుసగా మూడవ సారి లక్ష కు మించిన కేసులు నమోదయ్యాయి. ఇక ఈ రోజు లక్షా 25 వేల మార్కును దాటి కరోనా కేసులు పెరిగాయి. ఏప్రిల్ 5 మరియు 7 తేదీలలో భారతదేశం వరుసగా 103,558 మరియు 1,15,736 కేసులను నమోదు చేసింది. దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 900,000 మార్కును దాటి 9,10,319 కు చేరుకుంది . తాజాగా యాక్టివ్ కేసులు 66,846 పెరిగాయి. ఇక యాక్టివ్ కేసులు దేశంలో నమోదయిన మొత్తం కేసులలో 6.59% గా ఉన్నాయి.

 గత 24 గంటల్లో 685 మంది కరోనా మహమ్మారికి బలి

గత 24 గంటల్లో 685 మంది కరోనా మహమ్మారికి బలి

గత 24 గంటల్లో 59,258 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకోవడంతో, మొత్తం రికవరీలు 11,851,393 కు పెరిగాయి. దీంతో రికవరీ రేటు 92.11% వద్ద ఉంది. ఇక ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనా కారణంగా సంభవించిన మరణాలు 166,862 గా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 685 మంది కరోనా మహమ్మారి బలయ్యారు. మరణాల సంఖ్య మరియు మొత్తం కాసేలోడ్‌లో 1.30% గా ఉంది.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ప్రకారం, గత 24 గంటల్లో 1,237,781 నమూనాలను పరీక్షించారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు 25,26,77,379 కు చేరుకున్నాయి.

 దేశంలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్న కరోనా .. ప్రపంచంలో కేసుల్లో 3 వ స్థానంలో భారత్

దేశంలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్న కరోనా .. ప్రపంచంలో కేసుల్లో 3 వ స్థానంలో భారత్

ప్రస్తుతం భారత దేశ పరిస్థితి కరోనా మహమ్మారి విషయంలో రోజురోజుకు దారుణంగా తయారవుతుంది. ప్రపంచంలోనే యునైటెడ్ స్టేట్స్ మరియు బ్రెజిల్ తరువాత భారతదేశం కరోనా వ్యాప్తిలో మూడవ స్థానంలో ఉంది.

ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. మార్చి 1 న ఆసుపత్రిలో ఆయన మొదటి వ్యాక్సిన్ రోజును తీసుకున్నారు. ఈ రోజు ఎయిమ్స్‌లో నా రెండవ మోతాదు కోవిడ్-19 వ్యాక్సిన్ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్నారు. ఈ రోజు కరోనా తాజా పరిస్థితిపై , రోజురోజుకూ పెరుగుతున్న కేసులను కట్టడి చెయ్యటానికి ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల సీఎం లతో వర్చువల్ మీటింగ్ నిర్వహించనున్నారు .

మహారాష్ట్రలో కరోనా కరాళ నృత్యం .. దారుణంగా కరోనా పరిస్థితులు

మహారాష్ట్రలో కరోనా కరాళ నృత్యం .. దారుణంగా కరోనా పరిస్థితులు

కరోనా వైరస్‌ను ఓడించడానికి టీకా మా వద్ద ఉన్న కొన్ని మార్గాలలో ఒకటి. మీరు టీకాకు అర్హులు అయితే, మీ షాట్‌ను త్వరలో పొందండి. CoWin.gov.in లో నమోదు చేయండి, "అని ట్వీట్ చేశాడు.

దేశంలో కరోనా మహమ్మారి కారణంగా అత్యంత నష్టపోయిన రాష్ట్రమైన మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో, టీకాలు వేయడం నిన్న సాయంత్రం ఆగిపోయింది . వ్యాక్సిన్ డోసులు అందుబాటులో లేకపోవడంతో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కొన్ని ప్రాంతాలలో ఆపివేశారు. వ్యాక్సిన్ కొరత కారణంగా పూణే 100 కి పైగా టీకా కేంద్రాలను మూసివేసిందని పేర్కొన్నారు.
మహారాష్ట్రలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది . మహారాష్ట్ర కరోనా దెబ్బకు వణికిపోతుంది .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+