రాజకీయ నేతలకు కరోనా టెన్షన్ .. డిప్యూటీ స్పీకర్ తో పాటు ఒకేసారి 11 మంది ఎమ్మెల్యేలకు పాజిటివ్
రాజకీయ నాయకులను కరోనా మహమ్మారి పట్టిపీడిస్తోంది. ఏ రాష్ట్రంలో చూసినా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ఒకరోజు ముందు ఒడిశాలో డిప్యూటీ స్పీకర్ రజినీకాంత్ సింగ్ తో పాటు 11 మంది శాసనసభ్యులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లుగా తెలుస్తుంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ముందు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను శాసన సభ్యులు అందరికీ చేశారు. ఈ డ్రైవ్ లో డిప్యూటీ స్పీకర్ రజనీకాంత్ సింగ్ మాత్రమే కాకుండా 11 మంది శాసనసభ్యులకు కరోనా సోకటం ఒడిశా రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వ చీఫ్ విప్ ప్రమీలా మల్లిక్తో సహా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఆదివారం కోవిడ్ -19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది .ఇప్పటివరకు వచ్చిన ఫలితాలలో 11మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లుగా నిర్ధారించగా, సేకరించిన మరికొందరు శాసనసభ్యుల కరోనా టెస్ట్ ల ఫలితాలు మంగళవారం రానున్నాయి. ఇక ఈ రోజు ఇంకా ఎంత మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అవుతుందో తెలియాల్సి ఉంది.

తనకు కరోనా నిర్ధారణ పరీక్ష చెయ్యగా పాజిటివ్ వచ్చిందని భువనేశ్వర్ లోని ఆసుపత్రిలో చేరానని, ఇటీవలి కొద్ది రోజులలో తనతో సంప్రదించిన ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని డిప్యూటీ స్పీకర్ కోరారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు .
పూరి జిల్లాలోని సత్యబాది నియోజకవర్గ ఎమ్మెల్యే ఉమకాంత సమంతే కూడా సోషల్ మీడియా పోస్టులో తనకు కోవిడ్ -19 కు పాజిటివ్ వచ్చిందని చెప్పారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వ్యక్తులు క్వారంటైన్ కు వెళ్లాలని కోరారు. వర్షాకాల శాసనసభా సమావేశానికి ముందు స్పీకర్ ఎస్ ఎన్ పాట్రో ఆదేశాల మేరకు శాసన సభ్యులకు, అసెంబ్లీ సిబ్బందికి, జర్నలిస్ట్ లకు కరోనా నిర్ధారనా పరీక్షలు చేశారు . ఒడిశాలో ఇప్పటివరకు తొమ్మిది మంది మంత్రులతో సహా 50 మంది ఎమ్మెల్యేలు కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. ఇప్పుడు తాజాగా అసెంబ్లీ సమావేశాలకు ముందు 11మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
Recommended Video
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications