Coronavirus: కర్ణాటక- తమిళనాడుకు పోటీ, తమిళ తంబీలు, కన్నడిగులు హడల్, మోడీ ఫోన్, హామీ!
చెన్నై/ బెంగళూరు: భారతదేశంలో కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి వ్యాధి కేసులు లక్షల్లో పెరిగిపోవడంతో ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు. ఇక దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో ఏకంగా 1, 70, 693 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం, 2, 461 మంది మరణించడంతో తమిళ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తమిళనాడులో ఒక్కరోజులో 4, 979 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇక కర్ణాటకలో ఒక్కరోజులో 4, 120 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 63, 772 కు పెరిగింది. ఇక బెంగళూరులో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 24, 316కు పెరిగింది.
Recommended Video

తల్లడిల్లిపోయిన తమిళనాడు
ఆంధ్రప్రదేశ్ పొరుగున్న ఉన్న తమిళనాడులో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో తమిళ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తమిళనాడులో ఇప్పటి వరకు 1, 70, 693 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. తమిళనాడులో 24 గంటల్లో 4, 979 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. గత 24 గంటల్లో తమిళనాడులో కరోనా వైరస్ కాటుకు 78 మంది మరణించారు. తమిళనాడులో నేటి వరకు 2, 481 మంది కరోనా వైరస్ వ్యాధి చికిత్స విఫలమై మరణించారని ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.

చెన్నైలో గుడ్డిలో మెల్ల
చెన్నై సిటీలో ఇప్పటి వరకు 85, 859 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. గత 24 గంటల్లో చెన్నై సిటీలో మాత్రమే 1, 254 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. గతంతో పోల్చుకుంటే చెన్నై సిటీలో చాలా వరకు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది. తమిళనాడులో కరోనా వైరస్ తో పోరాటం చేసి ఇప్పటి వరకు 1, 17, 915 మంది వ్యాధి నయం చేసుకున్నారు.

కర్ణాటకలో కరోనా అట్టహాసం
ఆంధ్రప్రదేశ్* తెలంగాణ రాష్ట్రాలకు పొరుగున ఉన్న మరో రాష్ట్రం కర్ణాటకలో కరోనా అట్టహాసంతో కన్నడిగులు ఆందోళన చెందుతున్నారు. గత 24 గంటల్లో కర్ణాటకలో రికార్డు స్థాయిలో 4, 120 మందికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. ఇప్పటి వరకు కర్ణాటకలో మొత్తం కరోనా పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 63, 772కు చేరింది.

బెంగళూరు బెదుర్స్
ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని సిటికాన్ సిటీ బెంగళూరులో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 24, 316కు చేరింది. గత 24 గంటల్లో బెంగళూరు సిటీలో 2, 156 మందికి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. బెంగళూరులో ఒక్కరోజులో 36 మంది కరోనా వైరస్ వ్యాధికి బలి అయ్యారు. కర్ణాటకలో ఇప్పటి వరకు 39, 370 మంది కరోనా వైరస్ తో పోరాటం చేసి ప్రాణాలు దక్కించుకున్నారు. కర్ణాటకలో కరోనా వైరస్ మరణాల సంఖ్య 2.8 % తగ్గిందని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.

ప్రధానితో సీఎంలు చర్చలు
ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీతో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప, తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి చర్చించారు. కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసుల వివరాలను, ఆ వ్యాధి నిర్మూలణ కోసం ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల గురించి కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్ప ప్రధాని నరేంద్ర మోడీకి వివరించారు. గతంతో పొల్చుకుంటే తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య చాలా వరకు అరికట్టామని, నెలాకరులోగా చెన్నై సిటీని గ్రీన్ జోన్ లోకి తీసుకువస్తామని తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి ప్రధాని నరేంద్ర మోడీకి హామీ ఇచ్చారని అక్కడి ప్రభుత్వ అధికారులు తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications